News February 9, 2025

కాళేశ్వర క్షేత్రం అభివృద్ధికి మాస్టర్ ప్లాన్..

image

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు మాస్టర్ ప్లాన్ రూపొందించామని.. అందుకు తగ్గట్లుగా నిధులు మంజూరు చేస్తున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. మహా కుంభాభిషేక కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం మంత్రి కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, MLA గండ్ర సత్యనారాయణరావుతో కలిసి ఆయన మాట్లాడుతూ.. కాశీ, కేదార్‌నాథ్ కంటే ఈ క్షేత్రం ప్రాశస్త్యం కలదిగా పురాణాలు చెబుతున్నాయన్నారు.

Similar News

News December 9, 2025

డిసెంబర్ 9 లేకుంటే జూన్ 2 లేదు: కేటీఆర్

image

TG: తుది దశ తెలంగాణ ఉద్యమ ఫలితంగా రాష్ట్ర ఏర్పాటుకు తొలి అడుగుపడ్డ రోజు DEC 9 అని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR గుర్తుచేశారు. ‘అమరుల త్యాగం, KCR ఆమరణ నిరాహార దీక్షతో ఢిల్లీ పీఠం వణికింది. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు కేంద్రం ప్రకటించి నేటికి 16 ఏళ్లు. నవంబర్ 29(దీక్షా దివస్) లేకుంటే డిసెంబర్ 9(విజయ్ దివస్) లేదు. డిసెంబర్ 9 లేకుంటే జూన్ 2 లేదు. జై తెలంగాణ’ అని ట్వీట్ చేశారు.

News December 9, 2025

ప్రమాదంలో పద్మావతి అమ్మవారి ఆలయ పోటు కార్మికులు మృతి

image

నగరి పోలీస్ స్టేషన్ పరిధి తడకుపేట సమీపంలో రెండు కార్లు ఢీకొని <<18510891>>ముగ్గురు చనిపోయిన<<>> విషయం తెలిసిందే. మృుతల్లో ఇద్దరిని తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో పని చేసే పోటు కార్మికులు శంకర్, సంతానంగా గుర్తించారు. వీరు తిరుత్తణికి వెళ్లి స్వామి వారిని దర్శించుకుని వస్తుండగా ఈ ఘటన జరిగింది. ఇదే ప్రమాదంలో ఎదురుగా వచ్చిన కారులో వ్యక్తి సైతం మరణించాడు. పోలీసులు విచారణ చేపట్టారు.

News December 9, 2025

MDK: తొలి విడత పోరు.. ప్రచారానికి తెర నేడు.!

image

హోరా హోరీగా సాగిన తొలి విడత పంచాయతీ ఎన్నికల ప్రచారానికి నేటి సాయంత్రం 5 గంటల తర్వాత తెర పడనుంది. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చాక ప్రచారానికి ఎక్కువ సమయం లేకపోవడంతో పోటీలో ఉన్న అభ్యర్థులు తెల్లవారుజాము నుంచే ప్రచారం షురూ చేసి ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. తొలి విడతలో SDPT జిల్లాలో 163 జీపీలు, 1432 వార్డులు, MDKలో 160 జీపీలు, 1402 వార్డులు, SRDలో 136 జీపీలు,1246 వార్డుల్లో ఎన్నికలు జరుగనున్నాయి.