News April 5, 2025
కాళ్ల: బాబూ జగ్జీవన్ రామ్కు నివాళులర్పించిన కలెక్టర్

కాళ్ల మండలం వేంపాడు గ్రామంలో భారతదేశ తొలి ఉపప్రధాని బాబూ జగ్జీవన్ రామ్ జయంతిని శనివారం కలెక్టర్ సి.నాగరాణి నిర్వహించారు. గ్రామంలోని ఆయన విగ్రహానికి గ్రామ సర్పంచ్తో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్వాతంత్ర్య సమరయోధుడిగా, సమాజంలో అణగారిన ప్రజల కోసం కృషి చేసిన మహనీయుడని ఆయన్ని స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు.
Similar News
News April 8, 2025
ప.గో: రొయ్యకు రెస్ట్.. రైతుల నిర్ణయం

రొయ్యల సాగుకు మద్దతు ధరలు లేకపోవడంపై పచ్చిమ గోదావరి జిల్లా రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జులై నుంచి 3 నెలల పాటు రొయ్య సాగుకు విరామం ప్రకటిస్తున్నట్లు ఉమ్మడి ప.గో జిల్లాలోని పాలకొల్లు, నరసాపురం, ఆచంట నియోజకవర్గాలకు చెందిన రైతులు ప్రకటించారు. మేత నుంచి రొయ్యల మద్దతు ధరల వరకు తమకు అన్యాయం జరుగుతోందని, ప్రాసెసింగ్ ప్లాంట్ల నుంచి ప్రభుత్వం వరకు తమకు అండగా నిలవాలని ఆక్వా రైతులు డిమాండ్ చేశారు.
News April 8, 2025
కాగుపాడు సర్పంచ్ సస్పెన్షన్

ఉంగుటూరు మండలం కాగుపాడు సర్పంచ్ కడియాల సుదేష్ణను విధుల నుంచి మూడు నెలల పాటు సస్పెండ్ చేస్తూ కలెక్టర్ వెట్రిసెల్వి ఉత్తర్వులు జారీ చేశారు. పంచాయతీకి సంబంధించి నిధుల దుర్వినియోగం ఆరోపణలపై చర్యలు తీసుకున్నారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఉప సర్పంచ్ విధులు నిర్వర్తించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
News April 8, 2025
పాలకొల్లు: ప్రేమ విఫలం.. యువకుడి ఆత్మహత్య

ప్రేమ విఫలమై పాలకొల్లుకు చెందిన యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సోమవారం చోటు చేసుకుంది. స్థానిక బ్రహ్మానందరెడ్డి కాలనీకు చెందిన రత్నకుమార్ తనకంటే వయసులో పెద్దయిన అమ్మాయిని గత కొంతకాలంగా ప్రేమిస్తున్నానంటూ వెంట తిరిగేవాడు. ఆమె ప్రేమను తిరస్కరించడంతో మనస్తాపానికి గురైన రత్నకుమార్ ఇంటిపై అంతస్తులో పడుకుంటానని వెళ్లి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.