News December 1, 2024

కాళ్ల: లారీని ఢీకొట్టిన బైక్.. ఒకరు స్పాట్ డెడ్

image

బతుకుతెరువు కోసం చేపలు వేటకు వెళ్తూ కాళ్ల మండలం సీసలి గ్రామంలో లారీని ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందారు. పోలీసుల వివరాల ప్రకారం.. జువ్వలపాలెంకి చెందిన పైడిరాజు, చోడవరపు మధుబాబు బొండాడ లంక వేటకు వెళ్తూ ఎర్రయ్య రైస్ మిల్ వద్ద లారీని ఢీకొట్టారు. దీంతో పైడిరాజు మృతి చెందగా.. గాయపడిన మధుబాబును వైద్యం కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కాళ్ల ఎస్ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.

Similar News

News February 13, 2025

‘గూడెం’లో ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ తో కారు దగ్ధం

image

తాడేపల్లిగూడెం పట్టణం తాలూకా ఆఫీస్ ప్రాంగణంలో పార్క్ చేసి ఉన్న కియా కారు ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ కారణంగా దగ్ధమైనట్లు అగ్నిమాపక దళాధికారి జీవీ రామారావు బుధవారం తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే ఆ ప్రాంతానికి చేరుకుని మంటలు అదుపు చేసినట్లు వివరించారు. కారు విలువ సుమారు రూ.10 లక్షల వరకు ఉంటుందన్నారు. ఫైర్ సిబ్బంది కే. శ్రీశైలం, గురుప్రసాద్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

News February 12, 2025

ప.గో జిల్లాలో భారీగా పడిపోయిన చికెన్ ధరలు

image

బర్డ్ ఫ్లూ ప్రభావంతో పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా చికెన్ ధరలు భారీగా పడిపోయాయి. నిన్న మొన్నటి వరకు కిలో రూ .240 వరకు విక్రయించిన చికెన్ ,  ప్రస్తుతం రూ. 160 నుంచి రూ. 180 వరకు విక్రయిస్తున్నారు. బర్డ్ ఫ్లూ ప్రభావిత ప్రాంతాల్లో చికెన్ విక్రయాలు ఇప్పటికే నిలిపివేయగా మిగిలిన ప్రాంతాల్లో మాత్రం వినియోగదారులు కొనుగోలుకు ఆసక్తి చూపడం లేదు. 

News February 12, 2025

ఏలూరులో వ్యభిచారం.. పోలీసుల అదుపులో నిందితులు

image

ఏలూరులో మసాజ్ సెంటర్లపై టూటౌన్ సీఐ రమణ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. ఏలూరు ఫైర్ స్టేషన్ సమీపంలోని ఓవర్ బ్రిడ్జి కింద ఉన్న ఎస్ఎస్ కాల్ సెంటర్లో బ్యూటీపార్లర్ ట్రైనింగ్ కోర్సు పేరుతో యువతులతో వ్యభిచారం చేయిస్తున్నారని పలువురు ఆరోపించినట్లు తెలిపారు. దీంతో పోలీసులు దాడి చేసి కాల్ సెంటర్ నిర్వాహకుడు నాగార్జున, మరికొందరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.

error: Content is protected !!