News March 18, 2025
కాళ్ల : శివయ్యను తాకిన సూర్యకిరణాలు

కాళ్ల మండలం సీసలి గ్రామంలో ఉన్న శ్రీ అన్నపూర్ణ సమేత రామలింగేశ్వరస్వామి ఆలయంలో మంగళవారం అద్భుత సన్నివేశం చోటుచేసుకుంది. గర్భాలయంలోని శివలింగాన్ని సుమారు పది నిమిషాల పాటు సూర్యకిరణాలు తాకాయని ఆలయ అర్చకులు తెలిపారు. ఆదివారం నుంచి వరుసగా మూడు రోజులపాటు స్వామివారి లింగాన్ని సూర్యకిరణాలు తాకటం విశేషమని తెలిపారు. భక్తులు తరలివచ్చి అద్భుత సన్నివేశాన్ని చూస్తూ స్వామివారిని దర్శించుకున్నారు.
Similar News
News December 11, 2025
ఆకివీడు: రూ.5 వేలకే గ్రాము బంగారం అంటూ మోసం..!

ఆకివీడులో ఓ ముఠా గ్రాము బంగారం రూ.5 వేలకే ఇస్తామని నమ్మించి మోసానికి తెరలేపింది. బాధితులు తెలిపిన వివరాల మేరకు.. తక్కువ ధరకే బంగారం వస్తుందని ఆశపడిన భీమవరం, హైదరాబాద్ యువకులు ఆకివీడు వచ్చి రూ.2.50 లక్షలు చెల్లించారు. తీరా చూసుకుంటే అది నకిలీ బంగారమని తేలింది. బాధితులు తిరిగి వెళ్లి నిలదీయగా, రూ.1.20 లక్షలు వెనక్కి ఇచ్చి రాజీ కుదుర్చుకున్న ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.
News December 11, 2025
ఈనెల 15 న ప్రారంభం కానున్న నరసాపురం- చెన్నై వందేభారత్ రైలు

నరసాపురం నుంచి చెన్నైకు నూతన వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు సేవలు ఈనెల 15వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ రైలు నర్సాపురంలో మధ్యాహ్నం 2:50 గంటలకు బయలుదేరి రాత్రి 11:45 గంటలకు చెన్నై చేరుకుంటుంది. ఈ రైలు భీమవరం, గుడివాడ, విజయవాడ, తెనాలి ,ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట, మీదుగా ప్రయాణిస్తుంది. ముందుగా నిర్ణయించిన తేదీ కంటే ఒక నెల ముందుగానే ప్రారంభిస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.
News December 11, 2025
బాలికల పట్ల లింగ వివక్ష విడనాడాలి: DCPO

బాలికల పట్ల లింగ వివక్ష విడనాడాలని ఏలూరు జిల్లా చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అధికారి సూర్య చక్రవేణి అన్నారు. బాల్య వివాహ్- ముక్త్ భారత్ కార్యక్రమంలో భాగంగా బుధవారం తాడేపల్లిగూడెంలోని ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాల డిప్లొమా విద్యార్థులకు మహిళలపై హింస నిర్మూలన-బాల్య వివాహాలుపై అవగాహన కల్పించారు. బాలికలకు చిన్న వయసులో వివాహాలు చేయరాదన్నారు. ఐసీడీఎస్ సూపర్వైజర్లు దుర్గ భవాని, విశాలాక్షి పాల్గొన్నారు.


