News January 26, 2025

కాళ్ళలో సీనియర్ ఓటర్లను సన్మానించిన తహశీల్దార్

image

జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని శనివారం కాళ్ల హైస్కూల్లో నిర్వహించారు. తహశీల్దార్ జి. సుందర్ సింగ్ మాట్లాడుతూ ఓటరు నమోదు ఆవశ్యకతను, ఓటు హక్కు విలువలను వివరించారు.  సీనియర్ ఓటర్లైన వయోవృద్ధులను సత్కరించి, కొత్తగా ఓటు హక్కు పొందిన వారికి కొత్త ఓటు గుర్తింపు కార్డును పంపిణీ చేశారు. అనంతరం విద్యార్థులతో కలిసి ఓటు ఆవశ్యకతపై ర్యాలీ నిర్వహించారు. వీఆర్వోలు శివనాగరాజు, రాజశేఖర్ సిబ్బంది పాల్గొన్నారు.

Similar News

News December 6, 2025

భీమవరం: మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలి- కలెక్టర్

image

ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపనలో SHG మహిళలు అవగాహన కలిగి, యూనిట్ల స్థాపన ద్వారా ఆర్థికంగా అభివృద్ధి చెందాలని కలెక్టర్ నాగరాణి అన్నారు. శనివారం కలెక్టరేట్‌లో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఇప్పటికే స్థాపించిన యూనిట్లకు ఆధునిక సాంకేతికతను జోడించి వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడానికి, ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార శుద్ధి పరిశ్రమ క్రమబద్దీకరణ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.

News December 6, 2025

రేపు డయాలసిస్ కేంద్రాలకు భూమిపూజ: కేంద్రమంత్రి వర్మ

image

భీమవరం, ఆచంటలో రేపు డయాలసిస్ కేంద్రాల నిర్మాణానికి భూమి పూజ చేయనున్నామని కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. రోజురోజుకీ పెరుగుతున్న డయాలసిస్ రోగుల సమస్యలను దృష్టిలో పెట్టుకొని, నరసాపురం పార్లమెంట్ పరిధిలో అత్యాధునిక డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. సుమారు రూ.10కోట్ల CSR నిధులను వెచ్చిస్తున్నట్లు ఆయన తెలిపారు.

News December 6, 2025

కలెక్టర్ పిలుపు.. ‘3కె రన్ విజయవంతం చేయండి’

image

భీమవరం పట్టణంలో ట్రాఫిక్‌పై ప్రజలలో అవగాహన కల్పించేందుకు 3కె రన్ శనివారం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. ఈ రన్ బీవీ రాజు సర్కిల్ నుంచి ఉదయం 6:30 గంటలకు ప్రారంభమై జువ్వలపాలెం రోడ్డులోని ఏ.ఎస్.ఆర్ విగ్రహం వరకు కొనసాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థిని, విద్యార్థులు, వాకర్స్ అసోసియేషన్, అథ్లెటిక్స్, జిల్లా అధికారులు, ప్రజలు పాల్గొనాలని కోరారు.