News November 10, 2024
కావలికి శాప్ చైర్మన్ అనిమిని రవి నాయుడు రాక

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ అనిమిని రవి నాయుడు ఆదివారం కావలి పట్టణానికి విచ్చేస్తున్నారు. మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డితో కలిసి కావలి పట్టణంలోని మినీ స్టేడియాన్ని సందర్శిస్తారు. తదుపరి స్థానిక ప్రజల నుంచి సూచనలు స్వీకరిస్తారు. ఈ మేరకు ఎమ్మెల్యే కార్యాలయ సిబ్బంది శనివారం ఒక ప్రకటన ద్వారా పేర్కొన్నారు.
Similar News
News November 18, 2025
నెల్లూరు : రేషన్ కార్డుల జారీలో జాప్యం

అధికారుల నిర్లక్ష్యం ప్రజల పాలిట శాపంగా మారింది. జిల్లా వ్యాప్తంగా సంబంధించి 7,10,998 స్మార్ట్ రైస్ కార్డులు మంజూరవగా 6,35,716 కార్డులు పంపిణీ చేసారు. ఇంకా 75,282 కార్డులు సచివాలయాల్లో ఉన్నాయి. మరోవైపు రేషన్ కార్డులోని సభ్యులందరికి EKYC లు పెండింగ్లో ఉన్నాయి. వీటిల్లో 20,17,681 యూనిట్లు E-KYC చేయాల్సి ఉండగా 19,41,252 యూనిట్లకు పూర్తి చేశారు. మరోవైపు ఈ నెల 25 లోపు E-KYC కి అవకాశం కల్పించారు.
News November 18, 2025
నెల్లూరు : రేషన్ కార్డుల జారీలో జాప్యం

అధికారుల నిర్లక్ష్యం ప్రజల పాలిట శాపంగా మారింది. జిల్లా వ్యాప్తంగా సంబంధించి 7,10,998 స్మార్ట్ రైస్ కార్డులు మంజూరవగా 6,35,716 కార్డులు పంపిణీ చేసారు. ఇంకా 75,282 కార్డులు సచివాలయాల్లో ఉన్నాయి. మరోవైపు రేషన్ కార్డులోని సభ్యులందరికి EKYC లు పెండింగ్లో ఉన్నాయి. వీటిల్లో 20,17,681 యూనిట్లు E-KYC చేయాల్సి ఉండగా 19,41,252 యూనిట్లకు పూర్తి చేశారు. మరోవైపు ఈ నెల 25 లోపు E-KYC కి అవకాశం కల్పించారు.
News November 18, 2025
నెల్లూరు: ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానంటూ రూ.14.90 లక్షలు స్వాహా

నెల్లూరులోని దర్గామిట్ట పరిధికి చెందిన ఓ వ్యక్తికి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి రూ.14.90 లక్షలు తీసుకున్నారని SP డా.అజిత వేజెండ్లకు సోమవారం ఫిర్యాదు చేశారు. బీవీ నగర్కు చెందిన నాగేంద్ర అనే వ్యక్తి ప్రభుత్వ శాఖలో ఉద్యోగం ఇప్పించకుండా.. నగదు తిరిగి ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నాడని విచారించి న్యాయం చేయాలని కోరారు.


