News February 22, 2025
కావలిలో బాలికను వేధించిన నిందితుడికి జీవిత ఖైదు

బాలికను వేధించిన కేసులో నిందితుడికి జీవితఖైదు, రూ.27వేలు జరిమానా విధిస్తూ నెల్లూరు జిల్లా పోక్సో కోర్టు జడ్జి సిరిపిరెడ్డి సుమ తీర్చునిచ్చారు. కావలిలోని ఓ బట్టల షాపులో పనిచేసే బాలికకు సాయి కిషోర్ అనే వ్యక్తి పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా కలిశాడు. అనంతరం దారుణంగా ప్రవర్తించాడు. దీంతో బాలిక కుటుంబసభ్యులు కావలి పోలీసులకు 2017లో ఫిర్యాదు చేశారు. కేసు విచారించి జడ్జి శిక్ష ఖరారు చేశారు.
Similar News
News November 30, 2025
తెరపైకి దక్షిణ నెల్లూరు జిల్లా..!

స్లాంగ్, కల్చర్కు పూర్తి విభిన్నంగా ఉండే గూడూరును తిరుపతి జిల్లాలో కలిపారు. రాపూరు, కలువాయి, సైదాపురం సైతం ఇదే జిల్లాలో విలీనం చేయడాన్ని స్థానికులు వ్యతిరేకిస్తున్నారు. ‘రాయలసీమ వద్దు.. నెల్లూరు ముద్దు’ అనే నినాదంతో సోషల్ మీడియా వేదికగా ఉద్యమిస్తున్నారు. నెల్లూరులో కలిపి వీలు లేకుంటే.. గూడూరు కేంద్రంగా దక్షిణ నెల్లూరు జిల్లా ఏర్పాటు చేయాలని డిమాండ్ను అక్కడి ప్రజలు తెరపైకి తెచ్చారు.
News November 30, 2025
సైబర్ నేరాలు తగ్గేందుకు కృషి చెయ్యాలి : SP అజిత

సైబర్ నేరాలను తగ్గించేందుకు బ్యాంకర్లు తమకు సహకరించాలని SP అజిత కోరారు. జిల్లాలోని బ్యాంకు మేనేజర్లు, కోఆర్డినేటర్లతో ఆమె సమన్వయ సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం పెరుగుతున్న సైబర్ నేరాలను తగ్గించే విధానం, బ్యాంకులు ప్రజలకు ఎలా అవగాహన కల్పించాలి అనే దానిపై చర్చించారు. జిల్లాలోని ప్రజల ఆర్థిక రక్షణ కోసం పోలీస్ మరియు బ్యాంకులు కలిసి పనిచేయాల్సిన అవసరం ఎక్కువైందన్నారు.
News November 30, 2025
సైబర్ నేరాలు తగ్గేందుకు కృషి చెయ్యాలి : SP అజిత

సైబర్ నేరాలను తగ్గించేందుకు బ్యాంకర్లు తమకు సహకరించాలని SP అజిత కోరారు. జిల్లాలోని బ్యాంకు మేనేజర్లు, కోఆర్డినేటర్లతో ఆమె సమన్వయ సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం పెరుగుతున్న సైబర్ నేరాలను తగ్గించే విధానం, బ్యాంకులు ప్రజలకు ఎలా అవగాహన కల్పించాలి అనే దానిపై చర్చించారు. జిల్లాలోని ప్రజల ఆర్థిక రక్షణ కోసం పోలీస్ మరియు బ్యాంకులు కలిసి పనిచేయాల్సిన అవసరం ఎక్కువైందన్నారు.


