News April 12, 2025

కావలిలో మోసం

image

కావలిలో మరో మోసం వెలుగు చూసింది. కలిగిరికి చెందిన ఓవ్యక్తి పాతూరు శివాలయం వద్ద నాలుగేళ్లుగా ఉంటూ ఆన్‌లైన్ ట్రేడింగ్ చేస్తున్నాడు. ముందుగా ఒక్కొక్కరి నుంచి రూ.50వేలు తీసుకుని నెలకు రూ.7వేలు చొప్పున వాళ్లకు ఇచ్చి నమ్మించాడు. ఆ తర్వాత రూ.2కోట్ల వరకు వసూళ్లు చేసి రూ.లక్షకు రూ.14 వేల చొప్పున ఫిబ్రవరి వరకు ఇచ్చాడు. ఆ తర్వాత ఫోన్ లిప్ట్ చేయలేదు. ఇంటికి సైతం తాళం వేసి ఉండటంతో బాధితులు లబోదిబోమంటున్నారు.

Similar News

News July 7, 2025

నెల్లూరులో సోమవారం మంత్రి లోకేశ్ పర్యటన వివరాలు:

image

☞ ఉ. 9 గంటలకు VR మున్సిపల్ హైస్కూల్‌ను ప్రారంబోత్సవం
☞ 11 గంటలకు సిటీ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు
☞ మ.12 గంటలకు నాయకుల సమన్వయ సమావేశానికి హాజరవుతారు
☞ సాయంత్రం 4 గంటలకు బారాషాహీద్ దర్గాలో జరిగే రొట్టెల పండగ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు.

News July 6, 2025

మంత్రి లోకేశ్‌కు స్వాగతం పలికిన అబ్దుల్ అజీజ్

image

జిల్లా పర్యటనలో భాగంగా మంత్రి లోకేశ్ ఆదివారం రాత్రి రేణిగుంట విమానాశ్రయం చేరుకున్నారు. ఎయిర్ పోర్ట్‌లో ఆయనకు ఏపీ వక్ఫ్ బోర్డ్ ఛైర్మన్ అబ్దుల్ అజీజ్ స్వాగతం పలికారు. అనంతరం వారు రోడ్డు మార్గానా నెల్లూరుకు పయనమయ్యారు.

News July 6, 2025

ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకూడదు: కలెక్టర్

image

నెల్లూరు బారాషహిద్ దర్గాలో రొట్టెల పండుగ వైభవంగా కొనసాగుతోంది. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం పండుగ ఏర్పాట్లు, భద్రత, వసతులను కలెక్టర్ ఆనంద్, ఎస్పీ కృష్ణకాంత్ పరిశీలించారు. భక్తులకు ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని కలెక్టర్ అధికారుల్ని ఆదేశించారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు నిరంతరం పర్యవేక్షించాలని ఎస్పీ సూచించారు.