News July 3, 2024

కావలిలో హోటల్ సీజ్ చేసిన అధికారులు

image

కావలి పట్టణంలోని ఓ డాబా హోటల్ లో బుధవారం అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో హోటల్‌లో అపరిశుభ్ర వాతావరణం, తదితర తప్పిదాలను అధికారులు గుర్తించారు. రోజుల తరబడి మాంసం నిల్వ ఉండటంతో వెంటనే హోటల్‌ను సీజ్ చేసి గేట్లకు సీల్ వేశారు. వారు మాట్లాడుతూ.. హోటల్స్‌లో నాణ్యమైన ఆహారం, పరిశుభ్రత పాటించాలని లేకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు.

Similar News

News November 4, 2025

నెల్లూరు: బీటెక్ చదివి దొంగతనాలు

image

నెల్లూరులో నిన్న ఓ <<18189275>>దొంగ పట్టుబడిన <<>>విషయం తెలిసిందే. అల్లూరు(M) జమ్మిపాలేనికి చెందిన శ్రీనాథ్ 2009లో బీటెక్(సివిల్) పూర్తి చేశాడు. ప్రస్తుతం నెల్లూరులోని ఓ థియేటర్‌లో పనిచేస్తున్నాడు. ఆన్‌లైన్ క్యాసినో ఆడుతూ జీతం మొత్తం దానికే పెడుతున్నాడు. ఈజీ మనీకి అలవాటు పడి చైన్ స్నాచింగ్, బైకుల దొంగతనాలు మొదలు పెట్టాడు. గతనెల 23న చాకలి వీధిలో జరిగిన కేసులో దొరకగా.. 7బైకులు, రెండు చైన్లు రికవరీ చేశారు.

News November 4, 2025

నెల్లూరు జిల్లా సెంట్రల్ జైలుకు మాజీ మంత్రి జోగి

image

నకిలీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేష్‌తో పాటు అతని సోదరుడు జోగి రాములను నెల్లూరు జిల్లా సెంట్రల్ జైలుకి తరలించారు. విజయవాడ జైల్లో ఉన్న వారిద్దరిని నెల్లూరు సెంట్రల్ జైలుకు తీసుకురాగా.. జైలు వద్ద మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆయన్ని కలిశారు. ఈ సందర్భంగా జోగి రమేష్‌ని కాకాని గోవర్ధన్ రెడ్డి ఆలింగనం చేసుకున్నారు.

News November 3, 2025

నెల్లూరు: మా మొర ఆలకించండి సారూ..!

image

క్షేత్రస్థాయిలో సమస్యలు పరిష్కారం కాకపోవడంతోనే ప్రజలు ఉన్నతాధికారులకు మొరపెట్టుకుంటున్నారు. అర్జీలు ఇస్తున్నారు తప్పితే అవి పరిష్కారం కావడానికి మరలా కిందిస్థాయికి వెళ్లాల్సి వస్తుంది. రామాయపట్నం పోర్టుకు భూములిచ్చిన ఓ రైతుకు ఇవ్వాల్సిన పరిహారం తన ఖాతాలో కాకుండా మరొక రైతు ఖాతాలో జమయిందని కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. కానీ ఆ సమస్య అలానే ఉండిపోవడం పరిస్థితికి అద్దం పడుతోంది.