News June 26, 2024

కావలి: అన్న మరణాన్ని తట్టుకోలేక తమ్ముడు గుండెపోటుతో మృతి

image

ఇంట్లో జారిపడి అన్న మృతి చెందగా ఆ బాధతో గుండెపోటుకు గురై తమ్ముడు మరణించిన విషాదకరమైన ఘటన కావలిలో జరిగింది. కావలి పట్టణంలోని క్రిస్టియన్‌పేటలో నివాసం ఉంటున్న విశ్రాంత బ్యాంకు ఉద్యోగి సుధాకర్‌రెడ్డి(70) ఆదివారం తన ఇంట్లో జారిపడి మృతి చెందాడు. అన్న మృతదేహం వద్ద మనోవేదనకు గురైన ఆయన సోదరుడు వెంకటశేషారెడ్డి ఇంట్లోకి వెళ్లి అక్కడే కుప్పకూలిపడిపోయాడు. ఆసుపత్రికి తరలించగా మృతి చెందాడు.

Similar News

News December 12, 2025

NLR: ఒకే చీరకు ఉరేసుకుని భార్యాభర్తల సూసైడ్

image

నెల్లూరు జిల్లాలో శుక్రవారం విషాద ఘటన జరిగింది. టీపీగూడూరు మండలం వరకవిపూడికి చెందిన ఈదూరు నరేశ్(34), ప్రమీలమ్మ(28) దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇద్దరూ ఇంట్లోనే ఒకే చీరకు ఉరేసుకున్నారు. కుటుంబంలో ఏం జరిగింది? ఎందుకు ఈ దారుణానికి పాల్పడ్డారు? అనే ప్రశ్నలకు సమాధానాలు తెలియాల్సి ఉంది. పోలీసుల కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News December 12, 2025

నెల్లూరులో పొలిటికల్ హీట్ !

image

వణికించే చలిలోనూ నెల్లూరు రాజకీయాలు వేడెక్కాయి. కార్పొరేషన్ మేయర్ అవిశ్వాస ముహూర్తం దగ్గర పడే కొద్దీ పొలిటికల్ హీట్ మరింత పెరుగుతోంది. ప్రస్తుతం కార్పొరేషన్‌లో కార్పొరేటర్లు, ఎక్స్ అఫిషియో సభ్యులు కలిపి 57 మంది ఉన్నారు. అవిశ్వాస తీర్మానం రోజు కనీసం 38 మంది హాజరుకావాలి. 20 మంది గైర్హాజరు అయితే సభ వాయిదా పడే అవకాశం ఉంది. ఈ క్రమంలో వైసీపీ వ్యూహాత్మకంగా ఆ నంబర్‌పై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.

News December 12, 2025

నెల్లూరులో పొలిటికల్ హీట్ !

image

వణికించే చలిలోనూ నెల్లూరు రాజకీయాలు వేడెక్కాయి. కార్పొరేషన్ మేయర్ అవిశ్వాస ముహూర్తం దగ్గర పడే కొద్దీ పొలిటికల్ హీట్ మరింత పెరుగుతోంది. ప్రస్తుతం కార్పొరేషన్‌లో కార్పొరేటర్లు, ఎక్స్ అఫిషియో సభ్యులు కలిపి 57 మంది ఉన్నారు. అవిశ్వాస తీర్మానం రోజు కనీసం 38 మంది హాజరుకావాలి. 20 మంది గైర్హాజరు అయితే సభ వాయిదా పడే అవకాశం ఉంది. ఈ క్రమంలో వైసీపీ వ్యూహాత్మకంగా ఆ నంబర్‌పై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.