News April 17, 2024

కావలి: ఐదుగురి మరణానికి కారణం అదే..!

image

నిన్న కావలి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. జలదంకి(M) చామదల SC కాలనీకి చెందిన శ్రీనివాసులు HYDలో పనిచేస్తున్నారు. శ్రీరాముల కళ్యాణం జరిపించడానికి సొంతూరికి వచ్చారు. భార్య వరమ్మ, సోదరి లక్ష్మమ్మ, ఆమె కోడలు నీలిమ, మనవడు నందు(2)తో కలిసి కారులో కావలికి బయలుదేరారు. జలదంకి మీదుగా దగ్గరైనా.. రోడ్డు గుంతలమయంగా ఉండటంతో బిట్రగుంట మీదుగా వచ్చారు. ఆగి ఉన్న లారీని ఢీకొట్టడంతో అందరూ చనిపోయారు.

Similar News

News December 20, 2025

నెల్లూరు: ఈ నంబర్ మీ వద్ద ఉందా.?

image

వాట్సప్ గవర్నెన్స్ ద్వారా పోలీస్ సేవలు అందుబాటులో ఉన్నట్లు SP డా.అజిత వేజెండ్ల తెలిపారు. ప్రజలకు పారదర్శకంగా, వేగంగా సేవలు అందించాలని లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 9552300009 మనమిత్ర వాట్సాప్ సేవలను అందబాటులోకి తెచ్చిందన్నారు. ఈ-చలానా చెక్, ఎఫ్ఐఆర్ కాపీ డౌన్లోడ్, కేసు స్థితిగతులను తెలుసుకోవచ్చని ఆమె తెలిపారు. దీని వలన ప్రజల సమయం ఆదాకావడంతోపాటు ప్రజలకు పోలీసులు మరింత చేరువవుతారు.

News December 20, 2025

పల్స్ పోలియోపై వైద్య ఆరోగ్యశాఖ అవగాహన ర్యాలీ

image

పోలియో కార్యక్రమంపై జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఆదివారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. డీఎంహెచ్వో కార్యాలయం నుంచి గుప్తా పార్కు సెంటర్ వరకు సాగిన ఈ ర్యాలీని జిల్లా వైద్యశాఖ అధికారి సుజాత జెండా ఊపి ప్రారంభించారు. జిల్లా వ్యాప్తంగా 2,94,604 మంది ఐదేళ్లలోపు పిల్లలకు పల్స్ పోలియో కేంద్రాల ద్వారా పోలియో చుక్కలు అందించనున్నామన్నారు. 21 నుంచి మూడు రోజులపాటు ఈ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు.

News December 20, 2025

నెల్లూరు హౌసింగ్ పీడీ వేణుగోపాల్ బదిలీ

image

జిల్లా గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ వేణుగోపాల్‌ను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈయనను అమరావతి హౌసింగ్ ప్రధాన కేంద్రంలో రిపోర్ట్ చేసుకోవాలని ఉత్తర్వులో పేర్కొన్నారు. ఆయన స్థానంలో టిడ్కో ఈఈ మహేశ్‌కు ఇన్‌ఛార్జ్ ప్రాజెక్టు డైరెక్టర్‌గా బాధ్యతలు అప్పగించారు. దీంతో వేణుగోపాల్‌ను రిలీవ్ చేస్తూ శుక్రవారం కలెక్టర్ ఉత్తర్వులు జారీచేశారు.