News March 9, 2026

కావలి: చదివింది 5th.. రూ.150 కోట్లకు కుచ్చుటోపి.!

image

చదివింది 5th. రియల్ ఎస్టేట్‌లో అంచెలంచెలుగా ఎదిగి HYDలో త్రిపుర కన్‌స్ట్రక్షన్ ప్రారంభించాడు. ప్రజల నుంచి ప్లాట్ల పేరుతో భారీగా వసూలు చేశాడు. ఎన్నికల్లో జనసేన నుంచి పోటీచేసి దాదాపు రూ.150 కోట్లు ఖర్చు చేసినా డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయాడు కావలికి చెందిన పసుపులేటి సుధాకర్. ప్రజలు నిలదీయడంతో ఆయన బండారం బయటపడింది. అపార్ట్‌మెంట్స్ పేరుతో ప్రజలను మోసం చేసిన కేసులో పోలీసులు దంపతులను అరెస్ట్ చేశారు.

Similar News

News April 13, 2026

కలెక్టర్ సార్.. నెల్లూరులో వీటిపై ఓ కన్నేయండి!

image

నెల్లూరు జిల్లాలోని ప్రైవేట్ హాస్పిటళ్ల రిజిస్ట్రేషన్ రెన్యువల్, ల్యాబ్ పరీక్షలు, అదనపు బెడ్స్ ఏర్పాటుకు అనుమతులు ఉండటం లేదు. అర్హత లేనివాళ్లు వైద్య సేవలు అందిస్తున్నారు. వీటితో పాటు ఆసుపత్రి భవనాల్లో ఫైర్ సేఫ్టీ ప్రశ్నార్థకంగా మారింది. ఉదయగిరిలోని ఓ హాస్పిటల్లో 13 ఏళ్లుగా ఎలాంటి అనుమతలు లేకుండా వైద్యం అందించిన విషయం వెలుగు చూసిన విషయం తెలిసిందే. వీటిపై కలెక్టర్ ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది.

News April 13, 2026

నెల్లూరులో సిటీ బస్సులు.. ట్విస్ట్ ఇదే!

image

నెల్లూరులో <<19612409>>సిటీ బస్సులు <<>>తిప్పుతామని అధికారులు ఆర్భాటంగా ప్రకటించారు. కానీ వీటికంటూ ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేయలేదు. నెల్లూరు చుట్టుపక్కల గ్రామాలకు వెళ్లి వచ్చే బస్సులకే టౌన్ స్టాఫింగ్‌ ఇచ్చారు. వాటిపై పల్లెటూరి పేర్లు ఉండటంతో టౌన్ బస్సులని చాలామందికి తెలియడం లేదు. వీటిని ఎవరూ ఆపడం లేదు. ప్రత్యేక బస్సులు వేయడం లేదా పల్లెటూర్ల వాటికే టౌన్ సర్వీసులు అని తెలిసేలా బోర్డులు పెడితే బాగుంటుంది.

News April 13, 2026

డీసీపల్లి వద్ద రోడ్డు ప్రమాదం.. 14 ఏళ్ల బాలుడు ట్రాక్టర్ డ్రైవింగ్!

image

మర్రిపాడు మండలం, డీసీపల్లి – ఎన్నావాడ మార్గ మధ్యలో బైక్.. ట్రాక్టర్ ఢీకొన్న ఘటనలో బైక్‌పై ఉన్న మహేశ్, వెంకటేశ్ అనే యువకులకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఘటనలో ప్రమాదం జరిగినప్పుడు 14 ఏళ్ల బాలుడు ట్రాక్టర్ నడుపుతున్నట్లు తెలిసింది. ఈ ప్రమాదంపై ఇప్పటివరకు కేసు నమోదు కాలేదని బాధిత కుటుంబ సభ్యులు ఆదివారం తెలిపారు.