News February 6, 2025

కావలి DSPని ఆశ్రయించిన ప్రేమ జంట

image

కందుకూరు నియోజకవర్గం గుడ్లూరుకు చెందిన గుండె మడుగుల బెనర్జీ, ఉలవపాడు మండలం బద్దిపూడి గ్రామానికి చెందిన కీర్తి గత నాలుగు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. ముందుగా ఇరు కుటుంబాలను ఒప్పించుకొని పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. కుటుంబ సభ్యులు ఒప్పుకోకపోవడంతో వారు కావలిలోని ఓ చర్చిలో వివాహం చేసుకున్నారు. అమ్మాయి తల్లిదండ్రులు నుంచి ప్రాణహాని ఉందని గ్రహించి కావలి డీఎస్పీ శ్రీధర్‌ను ఆశ్రయించారు.

Similar News

News February 7, 2026

నెల్లూరు: రైలు ఢీకొని మహిళ స్పాట్ డెడ్

image

మనుబోలు రైల్వే స్టేషన్ ఉత్తరం వైపు ఫ్లాట్ ఫామ్ చివరన చెన్నై నుంచి విజయవాడ వెళ్లే లైన్‌లో గుర్తుతెలియని మహిళ పట్టాలు దాటే క్రమంలో ప్రమాదవశాత్తు రైలు ఢీకొని శనివారం సాయంత్రం మృతి చెందింది. వయస్సు సుమారు 50-55 ఏళ్లు ఉండొచ్చని, 5.0అడుగుల ఎత్తు కలిగి చాయా రంగు కలిగి ఉందని రైల్వే ఎస్సై హరి చందన తెలిపారు. మృతురాలు సిమెంట్ రంగుపై బులుగు రంగు సిల్క్ చీర, ఆకుపచ్చ పావడాను ధరించి ఉందని అన్నారు.

News February 7, 2026

సోమిరెడ్డికి కాకాణి సవాల్

image

నెల్లూరు జిల్లా ఇరిగేషన్ శాఖ అవినీతికి అడ్డాగా మారిందని మాజీ మంత్రి, వైసీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. రైతులను అడ్డం పెట్టుకుని పనులు చేయకుండానే కోట్ల రూపాయల బిల్లులు దోచుకున్నారన్నారు. ఈ అక్రమాలపై సీఎంకు లేఖ రాసినా స్పందన లేదని మండిపడ్డారు. అవినీతి ప్రశ్నిస్తే దాడులు, బెదిరింపులు చేస్తున్నారని, విజిలెన్స్ విచారణకు సిద్ధమా అని సోమిరెడ్డికి సవాల్ విసిరారు.

News February 7, 2026

నెల్లూరు: అయినోళ్లే ప్రాణాలు తీస్తున్నారు..!

image

నెల్లూరు జిల్లాలో చాలామందికి చట్టం అంటే భయం లేకుండా పోయింది. కావలిలో ఆస్తి కోసం సొంత వారే రైల్వే ఉద్యోగి <<19066737>>నాగరాజును <<>>హత్య చేశారని ఆరోపణలు ఉన్నాయి. నవాబుపేటలో మహిళ <<19072747>>హత్య<<>>, సైదాపురంలో అన్నదమ్ముల మధ్య రక్తపాతం జిల్లాను ఉలిక్కిపడేలా చేశాయి. పోలీసులు రాత్రి వేళ గస్తీ, డ్రోన్ కెమెరాలతో నిఘా పెట్టినా.. వరుస హత్యలు ఆగడం లేదు. నేరస్థులపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.