News February 18, 2025
కావ్యరచనకు ఆధ్యుడు వాల్మీకి మహర్షి: చాగంటి

వాల్మీకి మహర్షి కావ్యరచనకు ఆధ్యుడని బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు అన్నారు. విశాఖ మధురవాడ గాయత్రీ కళాశాల వేదికగా నిర్వహిస్తున్న శ్రీమద్రామాయణం ఉపన్యాసాన్ని ఆయన సోమవారం కొనసాగించారు. ఈ సందర్భంగా కావ్యాన్ని అత్యంత సుందరంగా అభివృద్ధి చేయడం వాల్మీకి మహర్షికే సాధ్యమన్నారు. ఎప్పుడు చేయాల్సిన పనులు అప్పుడే చేయాలని రామాయణంలో స్వామి హనుమ వివరించి తెలిపారని పేర్కొన్నారు. తర్వాత చేస్తే ప్రయోజనం శూన్యమన్నారు.
Similar News
News November 1, 2025
విశాఖలో DRO నియామకం ఎప్పుడో?

విశాఖలో DRO, RDO మధ్య జరిగిన వివాదంతో ఇద్దరినీ బదిలీ చేశారు. DRO భవానీ శంకర్ స్థానంలో JCకి అదనపు బాధ్యతలు అప్పగించారు. అయితే మరో 2 వారాల్లో నగరంలో CII భాగస్వామ్య సదస్సుతో పాటు పలు కీలక సమావేశాలు జరగనున్నాయి. సాధారణంగా ప్రోటోకాల్ వ్యవహారాలు, ముఖ్య అధికారుల పర్యటనలు, ప్రభుత్వ కార్యక్రమాల సమన్వయం వంటి పనులన్నీ DRO పరిధిలో ఉంటాయి. ఈ సమయంలో DRO స్థానం ఖాళీగా ఉండడంతో వీటిపై ప్రభావం చూపే అవకాశం ఉంది.
News October 31, 2025
విశాఖ: పట్టణ ప్రణాళిక అధికారులులతో మేయర్ సమీక్ష

GVMC పరిధిలో ఎన్ని ప్రకటనల హోర్డింగు బోర్డులు ఉన్నాయి వాటి పూర్తి వివరాలను నివేదించాలని నగర మేయర్ పీలా శ్రీనివాసరావు GVMC పట్టణ ప్రణాళిక అధికారులను ఆదేశించారు. శుక్రవారం GVMC కార్యాలయంలో పట్టణ ప్రణాళిక అధికారులు, ప్రకటన హోర్డింగుల ఏజెన్సీ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. పార్ట్నర్షిప్ సమ్మిట్కు ప్రకటన బోర్డులను ప్రదర్శించడానికి వాటికి ఎంత వసూలు చేస్తున్నారో వివరాలను అడిగి తెలుసుకున్నారు.
News October 31, 2025
UPSC పరీక్షల నిర్వహణకు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు: విశాఖ JC

నవంబర్ 2న నిర్వహించనున్న UPSC (యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్) పరీక్షలకు ఏర్పాట్లు చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ కె.మయూర్ అశోక్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 7 కేంద్రాల్లో జరిగే ఈ పరీక్షలకు 3268 మంది హాజరుకానునట్లు వెల్లడించారు. అభ్యర్థులకు ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని JC ఆదేశించారు.


