News March 30, 2024

కాశినాయన: 23 మంది వాలంటీర్లు రాజీనామా

image

కాశినాయన మండలం నరసాపురం సచివాలయం పరిధిలోని 23 మంది వాలంటీర్లు ఉద్యోగాలకు రాజీనామా చేశారు. రాజీనామా పత్రాలను సచివాలయాల పంచాయతీ కార్యదర్శులకు అందజేశారు. రాజీనామా చేసిన వారిలో నరసాపురం, మిద్దెల, మూలపల్లి, నరసన్నపల్లి గ్రామాల వాలంటీర్లు ఉన్నారు. తామంతా వైసీపీ గెలుపు కోసం స్వచ్ఛందంగా రాజీనామా చేశామని వారు తెలిపారు.

Similar News

News December 21, 2025

భూపేశ్ రాజకీయ ప్రస్థానం ఇదే.!

image

కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా భూపేశ్ రెడ్డి ఎంపికైన విషయం తెలిసిందే. ఆయన 1985 అక్టోబర్ 17న జన్మించారు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత 2009-10లో కడప జిల్లా కాంగ్రెస్ యువజనాధ్యక్షుడిగా పనిచేశారు. మైలవరం ZPTCగా 2014లో గెలిచారు. 2021లో TDPలో చేరి జమ్మలమడుగు ఇన్‌ఛార్జ్‌గా బాధ్యతలు తీసుకొని 2024లో MLA సీటు ఆశపడి నిరాశ పడ్డారు. పార్టీ అధిష్ఠానం మేరకు కడప ఎంపీగా పోటీ చేసి 66,000 ఓట్లతో ఓటమి చెందారు.

News December 21, 2025

కడప జిల్లాలో పంటల సాగు ఇలా.!

image

కడప జిల్లాలో రబీలో పెద్దముడియం మండలంలో అత్యధికంగా 11580 హెక్టార్లలోను, ఒంటిమిట్టలో అత్యల్పంగా 12 హెక్టార్లలో పంటల సాగు జరిగింది. VNపల్లె-8506, జమ్మలమడుగు-6248, ఎర్రగుంట్ల-5900, కమలాపురం-5555, సింహాద్రిపురం-5571, రాజుపాలెం-5226, కొండాపురం-4011, వల్లూరు-3651, ప్రొద్దుటూరు-2775, వేముల- 2730,
ముద్దనూరు-2081, పెండ్లిమర్రి-1714, వేంపల్లె-1645, కలసపాడు- 1154, తొండూరు-1088 హెక్టార్లలో పంటల సాగు జరిగింది.

News December 21, 2025

YS జగన్‌కు బర్త్ డే విషెస్ చెప్పిన షర్మిల.!

image

ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు YS షర్మిల తన అన్న YCP అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సోషల్ మీడియా వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ‘భగవంతుడు మీకు ఆయురారోగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’ అని ఆకాంక్షించారు. అన్నపై తనకున్న ప్రేమను చాటుకున్న ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.