News March 3, 2025
కాశీకి వెళ్లి మురిమడుగు మహిళా మృతి

ఉత్తరప్రదేశ్లోని కాశీ పుణ్యక్షేత్రం దర్శనానికి వెళ్లి జన్నారం మండలంలోని మురిమడుగు మహిళ బోర్లకుంట రాజవ్వ మృతి చెందింది. 11 రోజుల క్రితం రాజవ్వ కుంభమేళాలో భాగంగా కాశీకి వెళ్లి శివున్ని దర్శించుకుంది. అనంతరం రాజవ్వ హఠాత్తుగా పడిపోవడంతో ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. దీంతో కుటుంబ సభ్యులు ఆదివారం మణికర్ణిక ఘాట్లో రాజవ్వ పార్థివ దేహానికి అంత్యక్రియలు చేశారు.
Similar News
News February 26, 2026
భద్రాద్రి నూతన కలెక్టర్గా అంకిత్ బాధ్యతలు

భద్రాద్రి జిల్లా నూతన జిల్లా కలెక్టర్గా అంకిత్ గురువారం సాయంత్రం 6:19 గంటలకు కలెక్టరేట్లోని తన ఛాంబర్లో తొలి సంతకం చేసి అధికారికంగా పదవీ బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా బదిలీ అయిన కలెక్టర్ జితేష్ వి పాటిల్, అదనపు కలెక్టర్ వేణుగోపాల్ నూతన కలెక్టర్ను కలిసి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలోని అన్ని శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది హాజరై నూతన కలెక్టర్కు అభినందనలు తెలిపారు.
News February 26, 2026
FLNAT పరీక్షకు హాజరుకావాలి: కలెక్టర్

విశాఖలో ఫిబ్రవరి 28న వయోజన విద్యార్థులకు ప్రీ-ఫైనల్ FLNAT పరీక్ష నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్ తెలిపారు. ఉల్లాస్, అక్షరాంధ్ర పథకాల కింద 15 ఏళ్లు పైబడిన వారికి ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు ఈ పరీక్ష జరుగుతుంది. 2029 నాటికి సంపూర్ణ అక్షరాస్యత సాధించడమే లక్ష్యమని, అర్హులైన వారందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు.
News February 26, 2026
పనితీరు ఆధారంగానే టీచర్లకు ప్రమోషన్లు.. విద్యా కమిషన్ ప్రతిపాదన

TG: టీచర్లకు ఆటోమేటిక్ పదోన్నతులు రద్దు చేసి, పనితీరు ఆధారంగానే ప్రమోషన్లు ఇవ్వాలని ప్రభుత్వానికి విద్యాకమిషన్ కీలక సూచనలు చేసింది. ఐదేళ్లకోసారి ఉపాధ్యాయుల పనితీరు అంచనా వేయడం తప్పనిసరి చేయాలని, రెండేళ్లలో మెరుగుపడకపోతే సర్వీస్ నుంచి తొలగించేలా నిబంధనలు మార్చాలంది. ఈ నిబంధన ఇకపై నియమించే ఉపాధ్యాయులకు వర్తింపచేయాలని అభిప్రాయపడింది. ఈ మేరకు నివేదికను CM రేవంత్ రెడ్డికి అందజేసింది.


