News March 14, 2025
కాశీనాయన ఆశ్రమాన్ని పరిరక్షించండి: పురందరేశ్వరి

కేంద్రమంత్రి భూపేంద్ర యాదవ్ను BJP రాష్ట్ర అధ్యక్షురాలు పురందరేశ్వరి ఢిల్లీలో కలిశారు. నంద్యాల జిల్లా నల్లమల అడవుల్లోని జ్యోతి క్షేత్రంలో ఉన్న కాశీనాయన ఆశ్రమాన్ని పరిరక్షించాలని ఆమె కేంద్ర మంత్రిని కోరారు. జ్యోతి క్షేత్రం, కాశీనాయన ఆశ్రమం రాయలసీమలో పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నాయని లేఖలో వెల్లడించారు. కాగా బద్వేలులో కాశీనాయన ఆశ్రమాన్ని అధికారులు కూల్చివేసిన విషయం తెలిసిందే.
Similar News
News December 3, 2025
చారకొండలో 17.5 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత

నాగర్కర్నూల్ జిల్లాలో నిన్నటితో పోలిస్తే బుధవారం చలి తీవ్రత కొంత తగ్గింది. గడిచిన 24 గంటల్లో నమోదైన కనిష్ఠ ఉష్ణోగ్రత వివరాలను అధికారులు ప్రకటించారు. అత్యల్పంగా చారకొండ మండలంలో 17.5°C ఉష్ణోగ్రత నమోదైంది. అమ్రాబాద్లో 18.5°C, వెల్దండలో 18.6°C, కల్వకుర్తిలో 18.9°C డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు అధికారులు తెలిపారు.
News December 3, 2025
ఆదిలాబాద్: CM సభ.. పార్కింగ్ వివరాలు

ADB స్టేడియంలో రేపు జరిగే CM సభకు వచ్చేవారి కోసం పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేశారు.
★టూ వీలర్ ప్రజలకు రామ్ లీలా మైదానం, సైన్స్ డిగ్రీ కళాశాల వద్ద పార్కింగ్ చేసుకోవాలి
★ఆటోలకు, కార్లకు డైట్ కళాశాల మైదానం
★వీఐపీలకు శ్రీ సరస్వతి శిశు మందిర్, టీటీడీ కళ్యాణమండపం
★నిర్మల్ నుంచి వచ్చే బస్సులు, భారీ వాహనాలు పిట్టలవాడ, మావల PS మీదుగా వెళ్లి తెలంగాణ రెసిడెన్షియల్ బాయ్స్ Jr కళాశాలలో పార్కింగ్ చేసుకోవాలి
News December 3, 2025
స్క్రబ్ టైఫస్.. జాగ్రత్తలపై అధికారుల సూచనలు

AP: ‘ఓరియంటియా సుత్సుగముషి’ బాక్టీరియాతో <<18446507>>స్క్రబ్ టైఫస్<<>> సంక్రమిస్తుందని అధికారులు వెల్లడించారు. కీటకం కుట్టిన చోట నల్లటి మచ్చతో పాటు జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పులు ఉంటే స్క్రబ్ టైఫస్గా అనుమానించాలని చెప్పారు. ఎలుకలు సంచరించే ప్రదేశాల్లోని కీటకాలు కుడితే ఈ వ్యాధి వస్తుందన్నారు. పొలం పనులకు వెళ్లేవారు షూలు ధరించాలని, మంచాలు, పరుపులు, దిండ్లు వారానికి ఒకసారి శుభ్రం చేసుకోవాలని సూచించారు.
Share it


