News March 14, 2025
కాశీనాయన ఆశ్రమాన్ని పరిరక్షించండి: పురందరేశ్వరి

కేంద్రమంత్రి భూపేంద్ర యాదవ్ను BJP రాష్ట్ర అధ్యక్షురాలు పురందరేశ్వరి ఢిల్లీలో కలిశారు. నంద్యాల జిల్లా నల్లమల అడవుల్లోని జ్యోతి క్షేత్రంలో ఉన్న కాశీనాయన ఆశ్రమాన్ని పరిరక్షించాలని ఆమె కేంద్ర మంత్రిని కోరారు. జ్యోతి క్షేత్రం, కాశీనాయన ఆశ్రమం రాయలసీమలో పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నాయని లేఖలో వెల్లడించారు. కాగా బద్వేలులో కాశీనాయన ఆశ్రమాన్ని అధికారులు కూల్చివేసిన విషయం తెలిసిందే.
Similar News
News March 5, 2026
మంత్రి, ఎమ్మెల్యేలకు తప్పిన ప్రమాదం!

AP: కృష్ణా(D) గన్నవరం ఎయిర్పోర్టులో ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండైంది. HYDకు వెళ్లాల్సిన విమానం టేకాఫ్ అవుతుండగా ఇంజిన్లో సాంకేతిక లోపాన్ని పైలట్ గుర్తించి వెంటనే నిలిపేశారు. ఈ ఫ్లైట్లో మంత్రి గొట్టిపాటి రవి, MLAలు లక్ష్మీనారాయణ, పుల్లారావుతో పాటు 70 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో పలువురు రోడ్డు మార్గాన బయలుదేరగా ఇతరులకు వేరే విమానం ఏర్పాటు చేయనున్నట్లు ఇండిగో ప్రకటించింది.
News March 5, 2026
ఏలూరు: ఇంటర్ పరీక్షలకు జిల్లాలో 666 మంది గైర్హాజరు

ఏలూరు జిల్లా వ్యాప్తంగా గురువారం ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. మ్యాథ్స్ బి, బయాలజీ, జువాలజీ 1 పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా 56 సెంటర్లను ఏర్పాటు చేసినట్లు పరీక్షల అధికారి యోహన్ తెలిపారు. పరీక్షలకు 6,985 మంది విద్యార్థులు హాజరయ్యారు. వివిధ కారణాలతో 666 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని అధికారులు తెలిపారు. వేసవిని దృష్టిలో ఉంచుకొని విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టామన్నారు.
News March 5, 2026
NGKL: బాలికపై యువకుల అత్యాచారయత్నం

నాగర్కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండలంలోని ఓ గ్రామంలో ఓ బాలికపై అత్యాచారయత్నం జరిగినట్లు విశ్వసనీయ సమాచారం. బుధవారం రాత్రి ఈ దారుణం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. బాలికను ఇద్దరు యువకులు సమీపంలోని ఓ ఇంటిలోకి బలవంతంగా తీసుకువెళ్లారు. కుటుంబ సభ్యులు ఉప్పునుంతల పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనతో గ్రామస్థులు ఉలిక్కి పడ్డారు.


