News February 11, 2025

కాశీలో రాజన్న సిరిసిల్ల జిల్లా వాసి మృతి

image

కోనరావుపేట మండలం వెంకట్రావుపేట గ్రామానికి చెందిన కదిరే శ్రీనివాస్ గౌడ్ (45) కాశీలో మృతి చెందాడు. కుటుంబసభ్యులు వివరాల ప్రకారం.. 4 రోజుల క్రితం మిత్రులతో కలిసి ప్రయాగ్ రాజ్ లోని కుంభమేళాకు వెళ్లారు. తరువాత అయోధ్య రామమందిరాన్ని దర్శించుకొని ఆదివారం కాశీకి వెళ్లారు. కాశీలో దర్శనం కోసం క్యూ లైన్లో వేచి ఉండగా స్పృహతప్పి కిందపడ్డాడు. స్నేహితులు హాస్పీటల్ కు తరలించారు. వైద్యులు మృతి చెందినట్లు తెలిపారు.

Similar News

News November 21, 2025

SRPT: గ్రంథాలయాలు వెలుతురునిచ్చే కేంద్రాలు: కలెక్టర్

image

గ్రంథాలయాలు జీవితానికి వెలుతురునిస్తూ, భవిష్యత్తుకు దారి చూపెట్టేవి అని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. సూర్యాపేట గ్రంథాలయ వారోత్సవాల ముగింపు కార్యక్రమానికి హాజరయ్యారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికి అవసరమైన అన్ని పుస్తకాలు గ్రంథాలయంలో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. యువత వాటిని సద్వినియోగం చేసుకొని, ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి జీవితంలో స్థిరపడాలని ఆయన ఆకాంక్షించారు

News November 21, 2025

SRPT: గ్రంథాలయాలు వెలుతురునిచ్చే కేంద్రాలు: కలెక్టర్

image

గ్రంథాలయాలు జీవితానికి వెలుతురునిస్తూ, భవిష్యత్తుకు దారి చూపెట్టేవి అని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. సూర్యాపేట గ్రంథాలయ వారోత్సవాల ముగింపు కార్యక్రమానికి హాజరయ్యారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికి అవసరమైన అన్ని పుస్తకాలు గ్రంథాలయంలో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. యువత వాటిని సద్వినియోగం చేసుకొని, ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి జీవితంలో స్థిరపడాలని ఆయన ఆకాంక్షించారు

News November 21, 2025

పటాన్ చెరులో గంజాయి చాక్లెట్ల కలకలం

image

పటాన్‌చెరు పరిధి ఐడీఐ బొల్లారం మున్సిపాలిటీలోని లక్ష్మీనగర్‌లో నివాసం ఉండే ఒడిశాకు చెందిన అజయ్ కుమార్(50) తన పాన్ షాప్‌లో గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్నాడని పోలీసులు తెలిపారు. ఈ మేరకు నిందితుడిని అదుపులోకి తీసుకుని, అతడి వద్ద 238 గంజాయి చాక్లెట్లు, రూ.1,270 నగదు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.