News July 25, 2024
కాసిపేటలో మహిళ దారుణ హత్య

మహిళను ఓ వ్యక్తి హత్య చేసిన ఘటన కాసిపేట మండలంలో చోటుచేసుకుంది. లంబడి తండా గ్రామానికి చెందిన అజ్మీరా నీలా (45) భర్త 15 ఏళ్ల క్రితం మరణిచడంతో గాండ్ల రవి అనే వ్యక్తితో సహజీవనం చేస్తుంది. రవి స్నేహితుడు అంబరావు బుధవారం రవి లేని సమయంలో నీలా పై అత్యాచారం చేసేందుకు యత్నించాడు. ఆమె ఒప్పుకోకపోవడంతో గొంతు నులిమి హత్యచేసినట్లు పోలీసులు తెలిపారు.
Similar News
News December 17, 2025
ఒక్క ఓటుతో మూత్నూర్ తండా సర్పంచ్గా జాదవ్ రాంజీ

గుడిహత్నూర్ మండలంలోని మూత్నూర్ తండా గ్రామ సర్పంచ్గా జాదవ్ రాంజీ నాయక్ విజయం సాధించారు. సమీప అభ్యర్థిపై 1 ఓటు తేడాతో గెలుపొందారు. ప్రజల సమస్యల పరిస్కారానికి తన వంతు కృషి చేస్తూ.. ప్రతి క్షణం అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు.
News December 17, 2025
ADB: ‘కుష్ఠు వ్యాధిగ్రస్తుల గుర్తింపు ఉద్యమాన్ని విజయవంతం చేయండి’

ఈనెల 18వ తేదీ నుంచి 31వ తేదీ వరకు నిర్వహించనున్న కుష్ఠు వ్యాధిగ్రస్తుల గుర్తింపు ఉద్యమంను విజయవంతం చేయాలని డీఎంహెచ్ఓ డాక్టర్ నరేందర్ రాథోడ్ కోరారు. ఆశ కార్యకర్తతో కూడిన బృందం ఈ ఉద్యమంలో భాగంగా ప్రతి ఇంటిని సందర్శించి అందరిని పరీక్షించనున్నట్లు తెలిపారు. జిల్లాలో 1002 బృందాలు ఈ సర్వేలో పాల్గొంటున్నాయని పేర్కొన్నారు. ప్రజలు అందరు తమ ఇంటికి వచ్చే సర్వే బృందాలకు సహకరించాలని కోరారు.
News December 17, 2025
ఆదిలాబాద్ జిల్లాలో మొదటి విజయం మహిళదే

మూడో విడత స్థానిక ఎన్నికల్లో భాగంగా తలమడుగు మండల పరిధిలోని 22 గ్రామ పంచాయతీల్లో బుధవారం సర్పంచ్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. పల్లి-కే సర్పంచ్గా కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి గుమ్ముల లక్ష్మి విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి తొడసం రుక్మా బాయిపై 39 ఓట్ల తేడాతో గెలుపొందారు. 29 గ్రామ పంచాయతీలు ఉండగా.. 7 ఏకగ్రీవం అయ్యాయి.


