News March 30, 2024

కాసిపేట: భారీ నగదు స్వాధీనం

image

మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం సోమగూడెం చెక్ పోస్ట్ వద్ద భారీగా నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై ప్రవీణ్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా సరైన ఆధారాలు లేకుండా తరలిస్తున్న వరంగల్‌కు చెందిన మహేష్ వద్ద రూ.1,20,700/-, జార్పుల అమృ వద్ద రూ.2,75,000/-, దండేపల్లికి చెందిన వెంకటేష్ వద్ద రూ.2,97500/- నగదును స్వాధీనం చేసుకొని SSTటీం ఇన్‌ఛార్జ్‌కి అప్పగించినట్లు ఎస్సై వివరించారు.

Similar News

News February 9, 2026

ఆదిలాబాద్: ప్రచారానికి ముఖ్యనేతలేవరు రాలే..!

image

ఆదిలాబాద్ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన ప్రచార పర్వం నేటితో ముగియనుంది. కాసేపట్లో మైకులు మూగబోనున్నాయి. అయితే ఇప్పటివరకు ప్రధాన పార్టీల ముఖ్యనేతలు ఎవరుకుడా ప్రచారానికి రాలేదు. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ మాత్రమే జిల్లా కేంద్రంలో పర్యటించారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, అటు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ ప్రచారానికి వస్తారనే ప్రచారం సాగినప్పటికీ వారి పర్యటనపై ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత లేదు.

News February 8, 2026

ADB: ఈ నెల 11న సెలవు

image

మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఫిబ్రవరి 11 (బుధవారం)న స్థానిక సెలవు ప్రకటించినట్లు ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎన్నికలు జరిగే పురపాలక సంఘాల పరిధిలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలు, ఇతర ప్రభుత్వ సంస్థలు ఆ రోజున మూసివేస్తామని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరు తప్పనిసరిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు.

News February 7, 2026

ఉట్నూర్: పట్టుపురుగుల పెంపకంపై అవగాహన కల్పించాలి

image

గిరిజన రైతులకు మల్బరీ పంట సాగుపై అలాగే పట్టుపురుగుల పెంపకంపై అవగాహన కల్పించి, గిరిజన రైతులకు మంచి ఆదాయం వచ్చేలాగా కృషి చేయడానికి ప్రయత్నం చేయాలని ITDA PO యువరాజ్ మర్మాట్ స్పష్టం చేశారు. శనివారం వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో సమావేశాన్ని నిర్వహించారు. మల్బరీ తోటల సాగుకు రైతులను ఎంపిక చేయాలని, వారికి కావలసిన రాయితీ వివరాలను వివరించేలా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.