News March 18, 2025

కాసిపేట: సైకిల్‌పై నుంచి పడి ఒకరి మృతి

image

సైకిల్ పైనుంచి పడి ఒకరు మృతి చెందినట్లు కాసిపేట SI ప్రవీణ్ కుమార్ తెలిపారు. SI కథనం ప్రకారం.. హాజీపూర్ మండలానికి చెందిన రాజయ్య(65) కాసిపేటలోని కుమారుడి ఇంటికి వచ్చాడు. రాజయ్య సైకిల్‌పై తన స్నేహితుడి ఇంటికి వెళ్లి తిరిగి రాలేదు. అతడి కోసం వెతకగా మద్దిమాడ వద్ద పడి ఉన్నాడు. ఆసుపత్రికి తీసుకువెళ్లగా వైద్యులు పరీక్షించి అప్పటికే చనిపోయినట్లు నిర్ధారించారన్నారు. కొడుకు మల్లేశ్ ఫిర్యాదుతో కేసు నమోదైంది.

Similar News

News October 17, 2025

ఎన్టీఆర్: 20 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

image

ఎన్టీఆర్ జిల్లాలో మహిళా శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్ట్ పద్ధతిన ఆయా, అకౌంటెంట్, కుక్‌తో పాటు మొత్తంగా 20 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. దరఖాస్తు ప్రక్రియ, వేతనం వివరాలకు https://ntr.ap.gov.in/ వెబ్‌సైట్ చూడాలని..ఆసక్తి కల అభ్యర్థులు పూర్తి చేసిన దరఖాస్తులను ఈ నెల 22లోపు విజయవాడ మారుతినగర్‌ 2వ లైనులోని మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యాలయంలో అందచేయాలని సంబంధిత అధికారులు సూచించారు.

News October 17, 2025

నల్గొండ: రౌడీ షీటర్ 6 నెలల నగర బహిష్కరణ

image

రౌడీ షీటర్‌, ‘మిస్టర్‌ టీ’ యజమాని కె.నవీన్‌ రెడ్డిని 6 నెలల పాటు నగరం నుంచి బహిష్కరిస్తున్నట్లు రాచకొండ CP సుధీర్‌ బాబు ఉత్తర్వులు జారీ చేశారు. నల్గొండ(M) ముషంపల్లికి చెందిన నవీన్‌ రెడ్డి HYDకు వెళ్లి, ‘మిస్టర్‌ టీ’, ‘మిస్టర్‌ ఇరానీ టీ’ ఫ్రాంఛైజీలతో వ్యాపారం చేస్తున్నాడు. ఇతడి కార్యకలాపాలు శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నాయని, స్థానికులు భయాందోళన చెందుతున్నారని CP తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

News October 17, 2025

క్రాకర్స్ దుకాణాలకు అనుమతులు తప్పనిసరి: ఎస్పీ జగదీశ్

image

క్రాకర్స్ విక్రయలకు అనుమతులు తప్పనిసరని అనంతపురం జిల్లా ఎస్పీ జగదీశ్ తెలిపారు. లేకుంటే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి షాపులో అగ్నిమాపక పరికరాలు ఉండాలని, షాపుల మధ్య దూరం పాటించాలని తెలిపారు. షెడ్లు ప్రమాదకరంగా ఉండకూడదన్నారు. విద్యుత్ సరఫరా భద్రంగా ఉండేలా సర్టిఫైడ్ ఎలక్ట్రిషన్‌తో పనిచేయాలని సూచించారు.