News December 5, 2024

కియా కార్ల పరిశ్రమను సందర్శించిన మంత్రులు

image

పెనుకొండ మండల పరిధిలోని అమ్మవారుపల్లి వద్ద ఉన్న కియా కార్ల పరిశ్రమను రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సుభాశ్, బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత గురువారం సందర్శించారు. కియా కార్ల తయారీ, పరిశ్రమ చిరిత్రపై తెలుసుకున్నారు. అనంతరం కియా కార్మికులతో ఫొటోలు దిగారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 650 ఎకరాల్లో ఏర్పాటైన కియా కార్ల ప్లాంట్‌ను 2019లో సీఎం చంద్రబాబు ప్రారంభించిన విషయం తెలిసిందే.

Similar News

News February 12, 2026

ATP: ఉత్సవాల నిర్వహణపై అధికారుల సమీక్ష

image

అనంతపురం జిల్లాలో బ్రహ్మోత్సవాలు, జాతరలు, శివరాత్రి పర్వదినాల సందర్భంగా పక్కా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆనంద్, ఎస్పీ జగదీశ్ ఆదేశించారు. ఆలయాలు, మసీదులు, చర్చిల వద్ద బ్యారికేడింగ్, సీసీ కెమెరాలు, తాగునీరు, శానిటేషన్ సౌకర్యాలు కల్పించాలని సూచించారు. అగ్నిమాపక, అంబులెన్స్ వాహనాలను సిద్ధంగా ఉంచాలన్నారు. సమన్వయంతో పనిచేస్తూ సెక్యూరిటీ ఆడిట్ నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు.

News February 12, 2026

రెవెన్యూ అర్జీలపై వేగం పెంచాలి: జేసీ

image

అనంతపురం కలెక్టరేట్‌లో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో జేసీ విష్ణుచరణ్ రెవెన్యూ సమస్యల పరిష్కారంపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. పెండింగ్ అర్జీలను వెంటనే క్లియర్ చేయాలని, మ్యుటేషన్ దరఖాస్తులను గడువులోపు పరిష్కరించాలని ఆదేశించారు. మండలాల వారీగా పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ పూర్తి చేయాలన్నారు. పీజీఆర్‌ఎస్, మీ సేవా సేవలను వేగవంతం చేయాలన్నారు. రీసర్వే ఫేజ్-1, 2, 3 గ్రామాల్లో పనులు పూర్తి చేయాలన్నారు.

News February 12, 2026

రెవెన్యూ అర్జీలపై వేగం పెంచాలి: జేసీ

image

అనంతపురం కలెక్టరేట్‌లో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో జేసీ విష్ణుచరణ్ రెవెన్యూ సమస్యల పరిష్కారంపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. పెండింగ్ అర్జీలను వెంటనే క్లియర్ చేయాలని, మ్యుటేషన్ దరఖాస్తులను గడువులోపు పరిష్కరించాలని ఆదేశించారు. మండలాల వారీగా పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ పూర్తి చేయాలన్నారు. పీజీఆర్‌ఎస్, మీ సేవా సేవలను వేగవంతం చేయాలన్నారు. రీసర్వే ఫేజ్-1, 2, 3 గ్రామాల్లో పనులు పూర్తి చేయాలన్నారు.