News April 28, 2024

కిర్లంపూడిలో నేడు పవన్ కళ్యాణ్ సభ: జ్యోతుల

image

కిర్లంపూడిలో ఆదివారం జరిగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బహిరంగ సభను విజయవంతం చేయాలని జగ్గంపేట నియోజకవర్గ కూటమి అభ్యర్థి జ్యోతుల నెహ్రూ అన్నారు. కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్, జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్‌ఛార్జి తుమ్మలపల్లి రమేష్, జగ్గంపేట నియోజకవర్గ బీజేపీ ఇన్‌ఛార్జి దాట్ల కృష్ణ వర్మ, బీజేపీ నాయకురాలు కామినేని జయశ్రీ తదితరులతో నెహ్రూ సమావేశం నిర్వహించారు.

Similar News

News February 22, 2026

అనూరియా వ్యాధిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి దుర్గేశ్

image

తూ.గో. జిల్లాలో అనూరియా(మూత్రపిండాల వ్యాధి) కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ ఆదివారం సూచించారు. ఈ సందర్భంగా మంత్రి దుర్గేశ్ అధికారులు, వైద్య వర్గాలతో కలిసి తాజా పరిస్థితులను ఆదివారం ఫోన్ ద్వారా సమీక్షించినట్లు ఆయన తెలిపారు. అనూరియా వ్యాప్తి నివారణ కోసం అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షించాలన్నారు.

News February 22, 2026

రాజమండ్రి: అనూరియా కేసులపై ఎంపీ పురందేశ్వరి సమీక్ష

image

రాజమండ్రిలో నమోదైన అనూరియా కేసులపై ఎంపీ పురంధరేశ్వరి ఆదివారం కలెక్టర్ కీర్తి చేకూరి, డీఎంహెచ్వోలతో ఫోన్‌లో సమీక్షించారు. బాధితుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న ఆమె, వారికి మెరుగైన వైద్యసేవలు అందించాలని సూచించారు. కల్తీ అనుమానాల నేపథ్యంలో ఫుడ్ సేఫ్టీ అధికారులతో తనిఖీలు నిర్వహించాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజారోగ్యం విషయంలో ఎటువంటి అలసత్వం వహించవద్దని స్పష్టం చేశారు.

News February 22, 2026

రాజమండ్రి: అనూరియా కేసులపై జిల్లా యంత్రాంగం అప్రమత్తం

image

తూ.గో. జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఆదేశాల మేరకు రాజమండ్రిలో అనూరియా కేసుల క్లస్టర్‌పై జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డా. కే.వెంకటేశ్వరరావు వివరాలు ప్రకారం రాజమండ్రికి చెందిన నలుగురు వ్యక్తులు అనూరియా లక్షణాలతో ఆసుపత్రిలో చేరినట్లు చెప్పారు. జిల్లా సర్వైలెన్స్ అధికారికి సమాచారం అందించి విచారణ ప్రారంభించామన్నారు.