News April 28, 2024
కిర్లంపూడిలో నేడు పవన్ కళ్యాణ్ సభ: జ్యోతుల

కిర్లంపూడిలో ఆదివారం జరిగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బహిరంగ సభను విజయవంతం చేయాలని జగ్గంపేట నియోజకవర్గ కూటమి అభ్యర్థి జ్యోతుల నెహ్రూ అన్నారు. కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్, జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి తుమ్మలపల్లి రమేష్, జగ్గంపేట నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జి దాట్ల కృష్ణ వర్మ, బీజేపీ నాయకురాలు కామినేని జయశ్రీ తదితరులతో నెహ్రూ సమావేశం నిర్వహించారు.
Similar News
News December 22, 2025
తూ.గో. ఎస్పీ నరసింహ కిషోర్కు DGP బ్రాంజ్ డిస్క్ అవార్డు

తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ DGP బ్రాంజ్ డిస్క్ అవార్డును దక్కించుకున్నారు. డీజేపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పోలీస్ అధికారుల సేవలను గుర్తించి సిల్వర్, బ్రోన్జ్ డిస్క్ అవార్డులను ప్రకటించారు. అందులో భాగంగా జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్, కడియం ఎస్సై బి.నాగ దుర్గాప్రసాద్, సిబ్బందికి ఈ అవార్డులను ప్రకటించారు. ఈ సందర్భంగా ఎస్పీకి పోలీసు అధికారులు సిబ్బంది శుభాకాంక్షలు తెలియజేశారు.
News December 22, 2025
రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా అమర్జహే బెగ్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా కొవ్వూరు మండలం కాపవరం గ్రామానికి చెందిన అమర్జహ బేగ్ మహమ్మద్ నియమితులయ్యారు. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు అందాయన్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకి, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆల్కలాంబ, ఏపీసీసీ అధ్యక్షురాలు వైయస్ షర్మిలకి ఈ సందర్భంగా ఆమె కృతజ్ఞతలు తెలిపారు.
News December 22, 2025
రాజమండ్రి: కాశీ నవీన్ కుమార్ను సత్కరించిన జవహర్

తూ.గో జిల్లా TDP ప్రధాన కార్యదర్శిగా నియమితులైన కాశీ నవీన్కుమార్ను ఎస్సీ కమిషన్ మాజీ చైర్మన్, మాజీ మంత్రి కె.ఎస్. జవహర్ మర్యాదపూర్వకంగా కలిశారు. సోమవారం రాజమండ్రిలోని R&B గెస్ట్హౌస్లో జరిగిన ఈభేటీలో నవీన్ను శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు. పార్టీని నమ్ముకుని పనిచేసే సీనియర్ నాయకులకు ఎప్పుడూ తగిన గుర్తింపు ఉంటుందని, నవీన్ నియామకమే ఇందుకు నిదర్శనమని జవహర్ కొనియాడారు.


