News March 1, 2025

కిర్లంపూడి: ఆటోను ఢీకొట్టిన కారు.. ఒకరి మృతి

image

కిర్లంపూడి మండలం సోమవరం జంక్షన్ వద్ద NH-16పై శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆటో డ్రైవర్ నూకరాజు(47) మృతి చెందాడు. కిర్లంపూడి పోలీసుల వివరాల ప్రకారం.. సోమవరం గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ నూకరాజు ఖాళీ వాటర్ కేన్‌లతో ఆటోపై ఇంటికి వస్తుండగా వైజాగ్ వైపు వెళుతున్న కారు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. కిర్లంపూడి ఎస్సై సతీష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News November 18, 2025

పల్నాడు నాగమ్మ పాత్ర పై మీరేమనుకుంటున్నారు..?

image

మొదటి మహిళా మంత్రి, వీర వనిత పల్నాడు నాగమ్మ పాత్రపై చర్చ జరగవలసిన అవసరం ఉందని చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు. మహాశివ భక్తురాలుగా, నాటి సాంప్రదాయాలకు కట్టుబడి చిన్న వయసులోనే అసమాన ధైర్య సాహసాలు ప్రదర్శించిన వీర వనిత నాగమ్మ. అయితే రాజకీయ ఎత్తుగడల జిత్తుల మారిగా ఆమె పాత్రను చరిత్రలో అభివర్ణించారన్నారు. పురుషాదిక్యం ఉన్న నాటి సమాజంలో ఒంటరి మహిళ నాగమ్మ రాజకీయ చక్రం తిప్పిందంటున్నారు.. మీరేమంటారు?

News November 18, 2025

పల్నాడు నాగమ్మ పాత్ర పై మీరేమనుకుంటున్నారు..?

image

మొదటి మహిళా మంత్రి, వీర వనిత పల్నాడు నాగమ్మ పాత్రపై చర్చ జరగవలసిన అవసరం ఉందని చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు. మహాశివ భక్తురాలుగా, నాటి సాంప్రదాయాలకు కట్టుబడి చిన్న వయసులోనే అసమాన ధైర్య సాహసాలు ప్రదర్శించిన వీర వనిత నాగమ్మ. అయితే రాజకీయ ఎత్తుగడల జిత్తుల మారిగా ఆమె పాత్రను చరిత్రలో అభివర్ణించారన్నారు. పురుషాదిక్యం ఉన్న నాటి సమాజంలో ఒంటరి మహిళ నాగమ్మ రాజకీయ చక్రం తిప్పిందంటున్నారు.. మీరేమంటారు?

News November 18, 2025

చిత్తూరు జిల్లా రైతులకు రూ.136.46 కోట్లు

image

చిత్తూరు జిల్లాలోని రైతులకు బుధవారం అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ నిధులు జమకానున్నట్లు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి మురళీకృష్ణ వెల్లడించారు. అన్నదాత సుఖీభవ పథకం కింద 2.05 లక్షల మంది రైతులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.102.88 కోట్లు విడుదల చేయనుంది. పీఎం కిసాన్ పథకం కింద 1.67లక్షల మంది రైతులకు రూ.33.58 కోట్లను కేంద్ర ప్రభుత్వం రీలీజ్ చేస్తుంది. మొత్తంగా జిల్లా రైతుల ఖాతాల్లో బుధవారం రూ.136.46 కోట్ల జమవుతుంది.