News March 23, 2025

కిర్లంపూడి: పాము కాటుకు కౌలు రైతు మృతి

image

పొలం పనికి వెళ్లి పాము కరవడంతో కిర్లంపూడి మండలం ముక్కొల్లు గ్రామానికి చెందిన అనపర్తి కృష్ణ (56) అనే కౌలు రైతు కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. స్థానికుల కథనం మేరకు శుక్రవారం ఉదయం కృష్ణ పొలం పనికి వెళ్లగా పాము కాటు వేయడంతో స్పృహా తప్పి పడిపోయాడు. స్థానికులు వెంటనే అతడిని ప్రత్తిపాడు సీహెచ్సీకి తరలించగా కాకినాడ జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ చనిపోయాడాన్నారు.

Similar News

News November 11, 2025

రేణిగుంట: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

image

రేణిగుంట(M) కుక్కల దొడ్డి వద్ద మంగళవారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. కర్నూల్‌ నుంచి రేణిగుంట వైపు వస్తున్న కారును ఎదురుగా వచ్చిన లారీ ఢీకొనడంతో కారులో ప్రయాణిస్తున్న తల్లి, కుమారుడు అక్కడికక్కడే మృతి చెందారు. కోడలు సాఫ్ట్‌వేర్ ఉద్యోగి కావడంతో చెన్నైలో వదిలేందుకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కోడలు, చిన్నారి గాయాలతో బయటపడ్డారు. లారీ డ్రైవర్ నిద్రలో ఉండటమే కారణమని తెలుస్తోంది.

News November 11, 2025

ఢిల్లీలో ఆత్మాహుతి దాడి? కారులో ఉన్నది అతడేనా?

image

ఢిల్లీ పేలుడు ఆత్మాహుతి దాడేమోనని ఇన్వెస్టిగేషన్ సంస్థలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. పుల్వామాకు చెందిన సల్మాన్ నుంచి డా.ఉమర్ మహ్మద్ i20 కారు తీసుకున్నట్లు భావిస్తున్నాయి. బ్లాస్ట్‌కు ముందు కారులో బ్లాక్ మాస్క్‌తో ఉన్నది ఉమరేనా అనే కోణంలో విచారణ చేపట్టాయి. ప్లాన్ ప్రకారమే అతడు కారులో పేలుడు పదార్థాలతో వచ్చి ఎర్రకోట వద్ద ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడా? అని ఆరా తీస్తున్నాయి.

News November 11, 2025

పదేళ్లుగా బ్యాంకు ఖాతాల్లో నిలిచిపోయిన నగదు

image

తూ.గో జిల్లాలోని పలు బ్యాంకుల్లో లావేదేవీలు జరగకపోవడంతో పదేళ్లలో రూ.97.12 కోట్లు ఖాతాదారుల ఖాతాలో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. వ్యక్తి గత ఖాతాలు 5,09,614 కాగా నగదు రూ.75.05 కోట్లు ఉందన్నారు. పరిశ్రమలు ఖాతాలు 20,180 కాగా రూ.4.21 కోట్లుగా వెల్లడించారు. ప్రభుత్వ ఖాతాలు 5,154 కాగా రూ.4.21 కోట్లుగా నిర్ధారించారు. ఈ నగదు e-KYC, నామినీ పేర్లు తదితర వివరాలు సరిగా లేకపోవడంతో బ్యాంకులో నిల్వ ఉందన్నారు.