News January 21, 2025
కిర్లంపూడి: రహదారి ప్రమాదంలో స్నేహితుల మృతి

కాకినాడ జిల్లాకు చెందిన దాసరి నిమ్స్ చంద్ర(23), ముక్త దుర్గ బాబు(24)లు బైక్పై వెళ్తుండగా విజయవాడ హైవేపై నిన్న మృతి చెందిన విషయం తెలిసిందే. నిమ్స్చంద్ర తండ్రి ఆటో డ్రైవర్, తల్లి అంగన్ వాడీ కార్యకర్త. కిర్లంపూడికి చెందిన ముక్తదుర్గసాయి తమ్ముడు 10 నెలల క్రితం రోడ్డు ప్రమాదంలో మరణించాడు. ఇప్పుడు కుమారుడి మరణంతో తల్లిదండ్రులు ముత్తా పెద్దకాపు, సరస్వతి విలపిస్తున్న తీరు చూపరులను కంటతడి పెట్టించింది.
Similar News
News February 8, 2025
తూ.గో: వైసీపీలోకి ఉండవల్లి! సోషల్ మీడియాలో ప్రచారం

రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ వైసీపీలో చేరుతున్నారనే ప్రచారం నెట్టింట జోరందుకుంది. ఈ నెల 26న ఆయన వైఎస్ జగన్ సమక్షంలో ఆ పార్టీ కండువా కప్పుకుంటారని వైసీపీ శ్రేణులు నెట్టింట పోస్టులు పెడుతున్నాయి. ఈ ప్రచారంపై ఉండవల్లి స్పందించాల్సి ఉంది. కాగా ఉండవల్లికి వైఎస్ ఫ్యామిలీతో సత్సంబంధాలు ఉన్న విషయం తెలిసిందే.
News February 8, 2025
అనపర్తి MLA కుమారుడి పెళ్లికి హాజరైన CM

హైదరాబాద్ జూబ్లీహిల్స్ JRC కన్వెన్షన్ హల్లో అనపర్తి MLA నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కుమారుడు మనోజ్- సుమేఘరెడ్డిల వివాహ వేడుకకు సీఎం చంద్రబాబు హాజరయ్యారు. నూతన వధూవరులను సీఎం ఆశీర్వదించారు. అనంతరం MLAతో కాసేపు ముచ్చటించారు. ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
News February 8, 2025
రాజానగరం: రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

రాజానగరం హైవే గైట్ ఇంజినీరింగ్ కాలేజీ వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్య మృతి చెందగా.. భర్తకు తీవ్ర గాయాలయ్యాయి. బొమ్మూరుకి చెందిన వాకలపూడి వెంకటేశ్వరరావు అతని భార్య రాజేశ్వరి(65)తో కలిసి రాజనగరం మండలం పల్లకడియంలో ఉంటున్న కుమార్తె ఇంటికి స్కూటీపై బయలుదేరారు. దీంతో వెనుక నుంచి వస్తున్న లారీ వారిని ఢీకొనడంతో తలకు బలమైన గాయమై రాజేశ్వరి అక్కడికక్కడే మృతి చెందారు.