News February 22, 2025
కీసరగుట్ట జాతర.. 2,000 మందితో బందోబస్తు!

కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయ బ్రహ్మోత్సవాల కోసం కట్టుదిట్టంగా భద్రతను చేపడుతున్నట్లు సీపీ సుధీర్ బాబు తెలిపారు. ఫిబ్రవరి 24 నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. సుమారు 2,000 మంది పోలీసు సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు CP పేర్కొన్నారు. ఆలయం వద్ద ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపడుతున్నట్లు స్పష్టం చేశారు.
Similar News
News February 23, 2025
HYD: సొంత చెల్లినే గర్భవతి చేసిన అన్న

అన్న, చెల్లెని గర్భవతిని చేసిన ఘటన HYDలో జరిగింది. బాధితుల వివరాలు..ప్రకాశం జిల్లాకు చెందిన భార్యభర్తలకు కొడుకు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వారు విడాకులు తీసుకుని తల్లి, కుమార్తెలు విజయవాడలో, తండ్రి, కొడుకు HYDలో ఉంటున్నారు. పెద్ద చెల్లిని క్రిస్మస్కు సొంతూరు తీసుకెళ్లి తల్లికి అప్పజెప్పకుండా HYDకు వచ్చారు. కొన్నాళ్లకు కుమార్తె గర్భవతి అని తెలిసి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా విషయం బయటకొచ్చింది.
News February 23, 2025
HYD: ఫిబ్రవరిలోనే.. కరెంట్ డిమాండ్

గ్రేటర్ పరిధిలో సాధారణంగా మార్చి, ఏప్రిల్, మే, జూన్ మాసాల్లో విద్యుత్ డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. కానీ.. 2022 ఏప్రిల్ నెలలో నమోదైన సగటు గరిష్ఠ డిమాండ్ 3435 మెగావాట్లు. ప్రస్తుతం ఫిబ్రవరిలోనే 3456 మెగావాట్లుగా నమోదవుతోంది. ఇక మార్చి, ఏప్రిల్ నెలలో డిమాండ్ ఎంత పెరుగుతుందో అని అధికారులు అంచనాలు వేశారు. దీనికి అవసరమైన చర్యలు చేపడుతున్నారు.
News February 23, 2025
బంజారాహిల్స్: కాంగ్రెస్ సర్కార్పై హరీశ్ రావు ఎద్దేవా

కోట్లాది రూపాయల ప్రజాధనంతో చేపడుతున్న ఎస్ఎల్బీసీ సొరంగం కూలిపోవడం కాంగ్రెస్ అసమర్ధతకు, చేతగాని తనానికి నిదర్శనం అని మాజీమంత్రి హరీశ్ రావు అన్నారు. చేయక చేయక ఒక ప్రాజెక్టు పనులు మొదలుపెట్టి ఆరంభంలోనే అంతం చేసిన ఘనత కాంగ్రెస్ పాలకులదే అని ఎద్దేవా చేశారు. ఎస్ఎల్బీసీ సొరంగం కుప్పకూలడం కాంగ్రెస్ కమిషన్ సర్కారు వైఫల్యానికి నిదర్శనమని మండిపడ్డారు. ఈ ఘటనకు పూర్తి బాధ్యత ప్రభుత్వానిదే అన్నారు.