News February 26, 2025
కీసరలో రోడ్డు ప్రమాదం.. అన్నదమ్ములు మృతి

కీసర PS పరిధిలోని యాదగిరిపల్లిలో ORR సర్వీస్ రోడ్ మీద ప్రమాదం జరిగింది. పోలీసుల వివరాలు.. గూడూరు చంద్రశేఖర్ (32), మత్స్యగిరి (27) అన్నదమ్ములు. శ్రీను అనే మరో వ్యక్తితో బైక్పై బంధువుల ఇంటికి వెళ్లారు. తిరిగి వస్తుండగా ORR సర్వీస్ రోడ్లో ఎదురుగా వస్తున్న కారు ఢీ కొట్టింది. చంద్రశేఖర్ అక్కడిక్కడే చనిపోయాడు. మత్స్యగిరి చికిత్స పొందుతూ మృతి చెందాడు. కాగా, మార్చి 20న మత్స్యగిరి వివాహం జరగాల్సి ఉంది.
Similar News
News February 27, 2025
కడెంలో అక్రమంగా తరలిస్తున్న టేకు ఫర్నీచర్ పట్టివేత!

అక్రమంగా తరలిస్తున్న ఫర్నీచర్ వాహనాన్ని అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు. కడెం మండలంలోని గంగాపూర్ నుంచి ట్రాక్టర్ వాహనంలో వడ్ల సంచులు నింపుకొని లోపలి భాగంలో టేకు ఫర్నీచర్ సోఫాసెట్, బెడ్స్, డ్రెస్సింగ్ టేబుల్, డైనింగ్ టేబుల్ను ఉంచి తరలిస్తున్నారన్న పక్క సమాచారం మేరకు సెక్షన్ అధికారి కింగ్ ఫిషర్ పట్టుకొని రేంజ్ కార్యాలయానికి తరలించారు. అక్రమంగా కలప తరలిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
News February 27, 2025
ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధం: కలెక్టర్

ఉమ్మడి MDK- KNR- NZB- ADB పట్టభద్రులు, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధం చేసినట్లు మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. ఉదయం 8 గంటల నుంచి సాం. 4గంటల వరకు పోలింగ్ జరుగుతుందని, ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఆంక్షలు అమలు చేస్తామని, ప్రశాంతంగా ఎన్నికల నిర్వాహణకు సహకరించాలని SP కోరారు. పట్టభద్రుల బరిలో 56 మంది టీచర్స్ పోటీలో 15 మంది అభ్యర్థులు ఉన్నారు.
News February 27, 2025
కడెం: వ్యవసాయ బావిలోకి దూకి వ్యక్తి ఆత్మహత్య…!

మద్యానికి బానిసై ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన కడెం మండలంలో చోటుచేసుకుంది. SI కృష్ణసాగర్రెడ్డి కథనం ప్రకారం.. పాత మద్దిపడగ గ్రామానికి చెందిన బాతెం నర్సయ్య(67) మద్యానికి బానిసై ఇంట్లో తరచూ డబ్బులు అడిగేవాడు. ఈ క్రమంలో డబ్బులు ఇవ్వకపోవడంతో క్షణికావేశంలో వ్యవసాయ బావిలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కృష్ణసాగర్ రెడ్డి తెలిపారు.