News November 15, 2024

కీసర గుట్టకు ప్రత్యేక జిల్లా బస్సులు

image

కీసర గుట్టకు హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి నుంచి సిటీ బస్సులే కాకుండా వికారాబాద్, వరంగల్, సిద్దిపేట సహా పలు జిల్లాల నుంచి ప్రత్యేక బస్సులను ఆర్టీసీ ఏర్పాటు చేసింది. మరోవైపు నగరం నుంచి ఆర్టీసీ స్పెషల్ బస్సులను కూడా అందుబాటులో ఉంచినట్లు అధికారులు తెలిపారు. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని ఈ ఏర్పాట్లు చేశారు. ఉదయం నుంచే కీసర గుట్ట వద్ద భక్తులు బారులు తీరారు.

Similar News

News March 10, 2026

HYD: MNC కంపెనీల్లో ఉద్యోగాల పేరుతో భారీ మోసం

image

ప్రముఖ MNC కంపెనీల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ 137 మందిని మోసం చేసిన ముఠా గుట్టును బాచుపల్లి పోలీసులు రట్టు చేశారు. నిజాంపేట్‌కు చెందిన జగదీశ్ ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చిన ఈ కేసులో, నకిలీ ఆఫర్ లెటర్లు ఇచ్చి నిందితులు దాదాపు రూ.50 లక్షలు వసూలు చేసినట్లు తేలింది. పోలీసులు ప్రధాన నిందితుడు జక్కుల అజయ్‌ను అరెస్ట్ చేయగా, పరారీలో ఉన్న మరో ఇద్దరు నిందితులు శ్రావణి, సద్గుణ్ కోసం గాలిస్తున్నారు.

News March 10, 2026

HYD: మెట్రో.. ఇలా నడిపితే డేంజరే!

image

మెట్రో పెచ్చులూడుతున్నా.. ఆఫీసర్లు తేరుకోవడం లేదు. గతంలో అమీర్‌పేట్ స్టేషన్‌లో జరిగిన విషాదం(మౌనిక మృతి) తర్వాత కూడా మెట్రో భద్రతపై సమగ్ర ఆడిట్ రిపోర్టును ప్రభుత్వం ప్రజల ముందు ఉంచలేదు. 2025లో జరిగిన అంతర్గత తనిఖీల్లో Non-Air కండిషన్డ్ ఏరియాల్లో స్లాబ్ ఫెయిల్యూర్ సంకేతాలు ఉన్నట్లు తేలినా కాస్మెటిక్ రిపేర్లతో సర్దుబాటు చేశారు. థర్డ్ పార్టీ సేఫ్టీ సర్టిఫికేషన్ లేకుండానే మెట్రో రైళ్లను నడపడం డేంజరే.

News March 10, 2026

HYDలో రూ.430 కోట్లతో మరో కేబుల్ బ్రిడ్జ్

image

HYDలో మరో కేబుల్ బ్రిడ్జ్ నిర్మాణానికి ప్రభుత్వం ఓకే చెప్పింది. మీర్ ఆలం ట్యాంక్ మీదుగా ఈ కేబుల్ బ్రిడ్జిని ఏర్పాటు చేస్తారు. దీనిని 2.65 KMల పొడవు, 22.2 మీటర్ల వెడల్పుతో నిర్మించనున్నారు. ఈ బ్రిడ్జి మీర్ ఆలం ట్యాంక్ సమీపంలోని NH 44 నుంచి మీర్ ఆలం పార్క్ సమీపంలోని చింతల్మెట్ రోడ్డు వరకు ఉంటుంది. ఈ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం రూ.430 CR మంజూరు చేసింది. MP అసదుద్దీన్ ప్రభుత్వానికి థ్యాంక్స్ చెప్పారు.