News February 22, 2025
కీసర గుట్ట జాతర.. TOLL FREE నంబర్లు..!

కీసరగుట్ట జాతర ఫిబ్రవరి 24వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. కీసరగుట్ట మహాశివరాత్రి జాతర సంబంధించిన సమాచారం, జాతరలో ఎవరైనా తప్పిపోయినా వెంటనే తెలుసుకోవడం కోసం టోల్ ఫ్రీ నంబర్లు ఏర్పాటు చేశారు. ఇతర ఫిర్యాదులకు 040-29320699, 040-29350699కు కాల్ చేయాలని అధికారులు సూచించారు. ఈ నంబర్లకు కాల్ చేయడం ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చన్నారు.
Similar News
News December 5, 2025
KNR: ‘నజరానా’లంటారు.. ‘నారాజ్’ చేస్తారు..!

స్థానిక ఎన్నికల వేళ ప్రకటిస్తున్న నజరానాలు నీటి మూటలేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 2019లో ఉమ్మడి KNRలో 106 GPలు ఏకగ్రీవమవ్వగా తాజాగా 20 GP(1ST ఫేజ్)లు ఏకగ్రీవమయ్యాయి. అప్పటి BRS ప్రభుత్వం ఏకగ్రీవ గ్రామాలకు రూ.5 లక్షలిస్తానని రూపాయీ ఇవ్వలేదు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం రూ.10లక్షల నజరానా ప్రకటించగా కేంద్రమంత్రి బండి సంజయ్ BJP మద్దతున్న అభ్యర్థులను ఏకగ్రీవం చేస్తే రూ.10లక్షలు ఇస్తామని హామీ ఇచ్చారు.
News December 5, 2025
8ఏళ్లైనా పూర్తికాని WGL కమిషనరేట్ పనులు!

కమిషనరేట్ నూతన భవన నిర్మాణానికి 2017లో భూమిపూజ జరిగినా, ఎనిమిదేళ్లు కావస్తున్నా పనులు పూర్తి కాలేదు. దీంతో శాఖలకు చాంబర్లు, కార్యాలయాలు లేక ఇబ్బందులు అధికమవుతున్నాయి. పాత హెడ్ క్వార్టర్స్<<18473913>> భవనాల్లో తగిన స్థలం<<>> లేకపోవడంతో CP, DCPలు, అనేక విభాగాలు గదులు పంచుకొని పనిచేస్తున్న పరిస్థితి ఉంది. నిర్మాణం ఆలస్యం కారణంగా పోలీసులు రోజువారీ పనుల్లో సవాళ్లు ఎదుర్కొంటున్నారు. దీనిపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి.
News December 5, 2025
VJA: భవానీలకు 15 లక్షల వాటర్ బాటిల్స్.. 100 ప్రత్యేక బస్సులు.!

ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆలయంలో ఈ నెల 11 నుంచి 15 వరకు జరిగే భవానీ మాల విరమణకు సుమారు 7 లక్షల మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. భక్తుల సౌకర్యార్థం 15 లక్షల వాటర్ బాటిళ్లు, 325 మొబైల్ టాయిలెట్లు ఏర్పాటు చేస్తున్నారు. రద్దీని దృష్టిలో ఉంచుకొని విజయవాడ బస్టాండ్ నుంచి RTC 100 అదనపు బస్సులను కేటాయించింది. ప్రస్తుతం ఆలయం వద్ద బారిగేట్ల ఏర్పాటు పనులు కొనసాగుతున్నాయి.


