News February 17, 2025
కుంభమేళాకి వెళ్లి తాడిపత్రి మహిళ మృతి

అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన భక్తులు మహా కుంభమేళాకు వెళ్లిన బస్సు వారణాశికి సమీపంలో రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. అయితే ప్రమాదంలో ఏడుగురు గాయపడ్డారు. చేనేత కాలనీకి చెందిన నాగలక్ష్మి అనే మహిళ చికిత్స పొందుతూ మృతి చెందింది. మిగతా 6 మందికి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. అయితే యాత్రకు వెళ్లిన కొంతమంది ఫోన్లు పనిచేయకపోవడంతో ఆందోళనకు గురవుతున్నారు.
Similar News
News November 20, 2025
వేములవాడ: డ్రైనేజీలో పడి యువకుడి మృతి

వేములవాడ పట్టణంలోని రెండో బైపాస్ రోడ్డు ప్రాంతంలోని బతుకమ్మ తెప్ప వద్ద గల ప్రధాన డ్రైనేజీలో పడిపోయి ఓ యువకుడు మృతి చెందాడు. బుధవారం అర్ధరాత్రి అనంతరం ద్విచక్రవాహనం అదుపుతప్పి డ్రైనేజీలో పడిపోయి ఉంటాడని భావిస్తున్నారు. గురువారం తెల్లవారుజామున డ్రైనేజీలో ద్విచక్ర వాహనాన్ని, యువకుడి మృతదేహాన్ని గుర్తించారు. మృతి చెందిన యువకుడు స్థానిక బద్ది పోచమ్మ ఆలయంలో తాత్కాలిక పద్ధతిన పని చేస్తాడని తెలుస్తోంది.
News November 20, 2025
నేడే ఫెస్ట్.. HYD వస్తున్న ఉత్తర, తూర్పు భారత ప్రజలు

ఉత్తర, తూర్పు భారతదేశ నలు మూలల నుంచి గౌరవనీయ ప్రతినిధులు తెలంగాణ, నార్త్ ఈస్ట్ కనెక్ట్ టెక్నో, కల్చరల్ ఫెస్టివల్లో పాల్గొనేందుకు HYD చేరుకుంటున్నారు. రాజ్భవన్ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వ సహకారంతో నిర్వహిస్తున్న ఈ విశిష్టోత్సవం నేడు ప్రారంభం కానుంది. సాంకేతికతతో పాటు సంస్కృతిని కలగలిపే ఈ వేడుకలో తాజా అప్డేట్స్ కోసం వేచి ఉండండి.
News November 20, 2025
కామారెడ్డి జిల్లాలో ఉష్ణోగ్రతల వివరాలు

కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదుతో ప్రజలు గజగజ వణుకుతున్నారు. జిల్లాలో గడిచిన 24 గంటల్లో నమోదైన కనిష్ఠ ఉష్ణోగ్రతల వివరాలు అధికారుల వెల్లడించారు. బీబీపేట్ 8.9°C, గాంధారి 9.9, మేనూరు, లచ్చపేట, నస్రుల్లాబాద్ 10, రామారెడ్డి, రామలక్ష్మణపల్లి, డోంగ్లి 10.1, జుక్కల్, బొమ్మన్ దేవిపల్లి 10.2, సర్వాపూర్ 10.3, నాగిరెడ్డిపేట, బిచ్కుంద, బీర్కూర్ 10.5, లింగంపేట 10.8°C నమోదైంది.


