News February 7, 2025

కుంభమేళాకు అమలాపురం నుంచి ప్రత్యేక బస్సులు

image

మహా కుంభమేళ యాత్రకు వెళ్లేందుకు భక్తుల కోసం ఆర్టీసీ అమలాపురం డిపో నుంచి బస్సు సర్వీసులు నడుపుతున్నట్లు డిపో మేనేజర్ సత్యనారాయణమూర్తి శుక్రవారం తెలిపారు. ఫిబ్రవరి 12వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు బస్సు బయలుదేరుతుందన్నారు. 8 రోజులు పాటు జరిగే యాత్రలో భువనేశ్వర్, పూరి, కోణార్క్, ప్రయాగరాజ్, కుంభమేళా, వారణాసి, అయోధ్య, గయ, బుద్ధ గయ, అరసవిల్లి, శ్రీకూర్మం త్రివేణి సంగమం క్షేత్రాలు వెళ్లవచ్చని తెలిపారు.

Similar News

News November 12, 2025

జల సంరక్షణలో జనగామకు రూ.కోటి నజరానా..!

image

జన భాగస్వామ్యంతో జల సంరక్షణలో అద్భుత ఫలితాలు సాధించినందుకు గాను జనగామ జిల్లాకు కేంద్ర జల శక్తి మంత్రిత్వ శాఖ రూ.కోటి నజరానా ప్రకటించింది. కలెక్టర్ రిజ్వాన్ బాషా ఆధ్వర్యంలో అధికారులు, ప్రజల భాగస్వామ్యంతో గతేడాది 2024 ఏప్రిల్ నుంచి 30,569 ఇంకుడుగుంతల నిర్మాణం చేపట్టినందుకు గాను జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కింది. ఈనెల 18న రాష్ట్రపతి ముర్ము చేతుల మీదుగా నజరానా అందుకోనున్నారు.

News November 12, 2025

గజం రూ.3.40 లక్షలు.. 8 ఏళ్లలో 4 రెట్లు

image

TG: రాయదుర్గంలోని హైదరాబాద్ నాలెడ్జ్ సిటీ(HKC)లో గజం ధర రూ.3.40 లక్షలు పలికినట్లు TGIIC ఎండీ శశాంక తెలిపారు. 2017లో అక్కడ రూ.88వేలుగా ఉన్న ధర ప్రస్తుతం నాలుగు రెట్లు పెరిగినట్లు వెల్లడించారు. మొత్తం 4,770 గజాల స్థలాన్ని రూ.159 కోట్లకు విక్రయించామన్నారు. ఇక కోకాపేట, మూసాపేటలోని ఖాళీ ప్లాట్ల వేలం కోసం ప్రీబిడ్ సమావేశం ఈ నెల 17న టీహబ్‌లో నిర్వహించనున్నట్లు HMDA ప్రకటించింది.

News November 12, 2025

గుత్తిలో వ్యక్తి మృతి

image

గుత్తిలోని కర్నూల్ రోడ్డులో నిరుపయోగంగా ఉన్న హాస్టల్ ఆవరణలో ఓ గుర్తు తెలియని వ్యక్తి బుధవారం మృతి చెందారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు. మృతుడి వివరాలు, మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.