News February 7, 2025
కుంభమేళాకు అమలాపురం నుంచి ప్రత్యేక బస్సులు

మహా కుంభమేళ యాత్రకు వెళ్లేందుకు భక్తుల కోసం ఆర్టీసీ అమలాపురం డిపో నుంచి బస్సు సర్వీసులు నడుపుతున్నట్లు డిపో మేనేజర్ సత్యనారాయణమూర్తి శుక్రవారం తెలిపారు. ఫిబ్రవరి 12వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు బస్సు బయలుదేరుతుందన్నారు. 8 రోజులు పాటు జరిగే యాత్రలో భువనేశ్వర్, పూరి, కోణార్క్, ప్రయాగరాజ్, కుంభమేళా, వారణాసి, అయోధ్య, గయ, బుద్ధ గయ, అరసవిల్లి, శ్రీకూర్మం త్రివేణి సంగమం క్షేత్రాలు వెళ్లవచ్చని తెలిపారు.
Similar News
News November 24, 2025
వరంగల్: నిత్య పెళ్లికూతురి స్టోరీ.. వెలుగులోకి తెచ్చిన Way2News

తనకు వివాహమై కూతురు ఉన్నప్పటికీ పలు మ్యాట్రిమోనీ సైట్లలో ప్రొఫైల్ ఫొటోలు పెట్టి అమాయకులను పెళ్లిళ్లు చేసుకుని, అందిన కాడికి నగలు, నగదుతో పరారవుతున్న కిలాడీ లేడీ గురించి <<18378294>>Way2News<<>> వెలుగులోకి తెచ్చింది. పోలీసులు, నిఘావర్గాలు ఘటనపై ఆరా తీశాయి. పలు పత్రికలు, టీవీ ఛానళ్లు సైతం ఘటన గురించి వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేశారు. Way2News కథనాన్ని పలువురు సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు.
News November 24, 2025
జమ్మికుంట: క్వింటా పత్తి గరిష్ఠ ధర రూ.6,950

రెండు రోజుల విరామం అనంతరం సోమవారం జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ తిరిగి ప్రారంభమైంది. మార్కెట్కు రైతులు 70 వాహనాల్లో 594 క్వింటాళ్ల పత్తిని విక్రయానికి తీసుకురాగా, దీనికి గరిష్ఠంగా క్వింటాకు రూ.6,950, కనిష్టంగా రూ.6,000 ధర పలికిందని మార్కెట్ కార్యదర్శి రాజా తెలిపారు. గోనె సంచుల్లో తీసుకొచ్చిన 6 క్వింటాళ్ల పత్తికి గరిష్ఠంగా రూ.6,500 ధర లభించింది. గతవారం కంటే పత్తి ధర తాజాగా రూ.150 తగ్గింది.
News November 24, 2025
పెద్దపెల్లి: ‘మూడో ఏటా ప్రవేశిస్తున్నా.. హామీలు నెరవేర్చేలేదు’

ఆరు గ్యారంటీలతో సహా అనేక వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల బతుకులు మాత్రం మార్చలేకపోయిందని సీపీఐ ఎంఎల్ (మాస్ లైన్ ప్రజాపంథా) కరీంనగర్ ఉమ్మడి జిల్లా నాయకులు ఆరోపించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకుని మూడో ఏట ప్రవేశించే సందర్భంలో సంబరాలు చేసుకుంటోందని, కానీ హామీలు నెరవేర్చలేదని పేర్కొంటూ సోమవారం పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు.


