News January 31, 2025
కుంభమేళాకు కాజీపేట మీదుగా ప్రత్యేక రైళ్లు

ప్రయాగరాజ్ కుంభమేళా ప్రయాణికులను దృష్టిలో ఉంచుకుని కాజీపేట జంక్షన్ మీదుగా 4 ప్రత్యేక రైళ్లు నడిపిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. ఫిబ్రవరి 15న మౌలాలి- గయా (07089) ఎక్స్ప్రెస్ 19.43 గంటలకు, 18న వికారాబాద్- గయా (07091) ఎక్స్ ప్రెస్ 19.43 గంటలకు, 18న మౌలాలి- బనారస్ (07087) ఎక్స్ప్రెస్ 02.08 గంటలకు, 22న మౌలాలి- అజాంఘర్ (07707) 02.08 గంటలకు కాజీపేటకు చేరుకుంటాయని తెలిపారు.
Similar News
News November 18, 2025
రోడ్డుపై అడ్డంగా క్యూలైన్.. రాజన్న భక్తుల పాట్లు

వేములవాడ రాజన్న దర్శనాలను భీమేశ్వరాలయంలోకి మార్చినప్పటి నుంచి భక్తులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. భీమన్న ఆలయంలోకి వెళ్లడానికి పార్వతిపురం వెనుక నుంచి కొత్త క్యూలైన్ నిర్మించారు. నటరాజ్ విగ్రహం ముందు ఈ క్యూలైన్ను రోడ్డుపై అడ్డంగా నిర్మించడంతో ఇటువైపు నుంచి అటువైపు వెళ్లడానికి రోడ్డు దాటే మార్గం లేకపోవడంతో కొంతమంది మహిళా భక్తులు సోమవారం రాత్రి క్యూలైన్లపైకి ఎక్కి మరీ దాటడాన్ని పై ఫొటోలో చూడొచ్చు.
News November 18, 2025
రోడ్డుపై అడ్డంగా క్యూలైన్.. రాజన్న భక్తుల పాట్లు

వేములవాడ రాజన్న దర్శనాలను భీమేశ్వరాలయంలోకి మార్చినప్పటి నుంచి భక్తులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. భీమన్న ఆలయంలోకి వెళ్లడానికి పార్వతిపురం వెనుక నుంచి కొత్త క్యూలైన్ నిర్మించారు. నటరాజ్ విగ్రహం ముందు ఈ క్యూలైన్ను రోడ్డుపై అడ్డంగా నిర్మించడంతో ఇటువైపు నుంచి అటువైపు వెళ్లడానికి రోడ్డు దాటే మార్గం లేకపోవడంతో కొంతమంది మహిళా భక్తులు సోమవారం రాత్రి క్యూలైన్లపైకి ఎక్కి మరీ దాటడాన్ని పై ఫొటోలో చూడొచ్చు.
News November 18, 2025
టెక్నాలజీతో ఉత్తమ ఫలితాలు.. జర్మనీ సదస్సులో జిల్లా రైతులు

టెక్నాలజీని అందిపుచ్చుకోవడం ద్వారా వ్యవసాయంలో ఉత్తమమైన ఫలితాలు సాధించవచ్చు అని మామిడిపెల్లికి చెందిన రైతులు నోముల వేణుగోపాల్ రెడ్డి, మోకిడె శ్రీనివాస్, నాగారానికి చెందిన దుంపేట నాగరాజు తమ అనుభవాలను వివరించారు. ACRAT ప్రాజెక్టులో భాగంగా జర్మనీలో ఐదు రోజుల వ్యవసాయ సదస్సులో రాష్ట్రానికి చెందిన 12 మంది సభ్యుల బృందంతో కలిసి పాల్గొన్న వీరు తమ క్షేత్రస్థాయి అనుభవాలను పంచుకున్నారు.


