News January 29, 2025
కుంభమేళాకు వెళ్లే వారి కోసం ప్రత్యేక రైలు

కుంభమేళా సందర్భంగా విజయవాడ మీదుగా గయకు(బీహార్) ప్రత్యేక రైళ్లు నడుపుతున్నామని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ మేరకు నం.07095 కాకినాడ టౌన్- గయ రైలును ఫిబ్రవరి 8న, నం.07096 గయ- విజయవాడ ఫిబ్రవరి 10న నడుపుతున్నామంది. నం.07095 రైలు 8న సాయంత్రం 7.35కి విజయవాడ చేరుకుని 10న ఉదయం 10 గంటలకు గయ చేరుకుంటుందని, 10న నం.07096 రైలు మధ్యాహ్నం 2.15కి బయలుదేరి 12న సాయంత్రం 4కి విజయవాడ చేరుకుంటుందని తెలిపింది.
Similar News
News November 24, 2025
టమాటా కేజీ రూ.80!

TG: నిన్న, మొన్నటి వరకు కేజీ రూ.20-40కే లభించిన టమాటా ఇప్పుడు కొండెక్కింది. ప్రస్తుతం కిలో రూ.60 నుంచి రూ.80 వరకు పలుకుతోంది. దీంతో మార్కెట్లలో టమాట రేటు చూసి సామాన్యులు నోరెళ్లబెడుతున్నారు. కొన్ని మార్కెట్లలో అయితే టమాటానే దొరకడం లేదు. ధర వెచ్చించలేక వ్యాపారులు కొనుగోలు చేయడంలేదు. ఇటీవల మొంథా తుఫాన్ ప్రభావంతో టమాట పంటలు తీవ్రంగా దెబ్బ తినడమే ధరల పెరుగుదలకు కారణమని వ్యాపారులు తెలిపారు.
News November 24, 2025
GNT: నేడు వంగర వెంకట సుబ్బయ్య జయంతి

తెలుగు సినిమా, నాటక రంగాలలో ప్రసిద్ధి చెందిన హాస్యనటుడు వంగర వెంకట సుబ్బయ్య జయంతి నేడు. ఆయన 1897, నవంబర్ 24న సంగం జాగర్లమూడిలో జన్మించారు. రంగస్థల ప్రస్థానంలో తెనాలిలో స్థిరపడి, ‘శ్రీకృష్ణ తులాభారం’ నాటకంలో వసంతకుడి వేషంతో కళాహృదయుల మన్ననలు అందుకున్నారు. ఆయన దాదాపు వందకు పైగా తెలుగు చిత్రాలలో నటించారు. ‘పెద్దమనుషులు’, ‘కన్యాశుల్కం’, ‘మాయాబజార్’ వంటి చిత్రాలలో తన హాస్యంతో ప్రేక్షకులను అలరించారు.
News November 24, 2025
తమిళనాడుకు భారీ వర్ష సూచన.. విద్యాసంస్థలకు సెలవులు

తమిళనాడు, పుదుచ్చేరిలో భారీ వర్షాలు కురుస్తాయని IMD హెచ్చరించడంతో 18 జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలకు సోమవారం సెలవులు ప్రకటించారు. ఒకేసారి 2 సైక్లోనిక్ తుఫానులు రావడంతో తమిళనాడులో భారీ వర్షాలు కొనసాగుతాయని అధికారులు హెచ్చరించారు. ఇప్పటికే తెంకాసి, తిరునల్వేలి, తూత్తుకుడి సహా పలు జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి.


