News January 29, 2025

కుంభమేళాకు వెళ్లే వారి కోసం ప్రత్యేక రైలు

image

కుంభమేళా సందర్భంగా విజయవాడ మీదుగా గయకు(బీహార్) ప్రత్యేక రైళ్లు నడుపుతున్నామని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ మేరకు నం.07095 కాకినాడ టౌన్- గయ రైలును ఫిబ్రవరి 8న, నం.07096 గయ- విజయవాడ ఫిబ్రవరి 10న నడుపుతున్నామంది. నం.07095 రైలు 8న సాయంత్రం 7.35కి విజయవాడ చేరుకుని 10న ఉదయం 10 గంటలకు గయ చేరుకుంటుందని, 10న నం.07096 రైలు మధ్యాహ్నం 2.15కి బయలుదేరి 12న సాయంత్రం 4కి విజయవాడ చేరుకుంటుందని తెలిపింది.

Similar News

News November 20, 2025

వయసు పెరుగుతున్నా.. తగ్గేదేలే!

image

తెలుగు హీరోలు మహేశ్(50), నాగార్జున(66) సహా పలువురు నటులు వయసు పెరిగే కొద్దీ మరింత యంగ్‌ లుక్‌లో కనిపిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. వారి ముఖాల్లో ఏమాత్రం వృద్ధాప్య ఛాయలు కనిపించకపోవడం ‘వయసు వెనక్కి వెళ్తోందా?’ అనే చర్చకు దారితీస్తోంది. ఈ హీరోలు తమ ఫిట్‌నెస్, లైఫ్‌స్టైల్‌పై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం వల్లే ఇలాంటి ‘ఏజింగ్ బ్యాక్‌వర్డ్స్’ లుక్ సాధ్యమవుతోందని ఫిట్నెస్ నిపుణులు చెబుతున్నారు.

News November 20, 2025

పల్నాటి వీరారాధనోత్సవాల్లో రాయబార ఘట్టం

image

పల్నాటి వీరాధనోత్సవాల్లో గురువారం రాయబార ఘట్టాన్ని నిర్వహించారు. సుమారు 7 సంవత్సరాలు 6 నెలలుగా అరణ్యవాసంలో ఉన్న మాచర్ల రాజ్యమంది తిరిగి తమ రాజ్యాన్ని స్వాధీనం చేసుకోవడాన్ని బ్రహ్మన్న మళ్లీ దేవరాజులు అనుకునే సంఘటనగా ఆచారవంతులు ప్రతిబింబించగా, పీఠాధిపతి తరుణ్ చెన్నకేశవ ఆధ్వర్యంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కొణతాలతో (వీరుల ఆయుధాలు) గ్రామోత్సవం ఘనంగా జరిగింది.

News November 20, 2025

గంభీర్‌పై విమర్శలు.. బ్యాటింగ్ కోచ్ ఏమన్నారంటే?

image

SAతో తొలి టెస్టులో టీమ్ ఇండియా ఓడటంతో హెడ్ కోచ్ గంభీర్‌పై <<18307995>>విమర్శలొచ్చిన<<>> సంగతి తెలిసిందే. దీనిపై బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో స్పందించారు. ‘గంభీర్ ఒక్కడినే టార్గెట్ చేస్తూ అందరూ మాట్లాడుతున్నారు. బ్యాటర్లు, బౌలర్లు, సపోర్ట్ స్టాఫ్ గురించి ఎందుకు మాట్లాడట్లేదు. కోల్‌కతా పిచ్‌ను మేం బ్లేమ్ చేయట్లేదు. అది అంత త్వరగా టర్న్ అవుతుందని ఊహించలేదు’ అని పేర్కొన్నారు.