News January 29, 2025
కుంభమేళాకు వెళ్లే వారి కోసం ప్రత్యేక రైలు

కుంభమేళా సందర్భంగా విజయవాడ మీదుగా గయకు(బీహార్) ప్రత్యేక రైళ్లు నడుపుతున్నామని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ మేరకు నం.07095 కాకినాడ టౌన్- గయ రైలును ఫిబ్రవరి 8న, నం.07096 గయ- విజయవాడ ఫిబ్రవరి 10న నడుపుతున్నామంది. నం.07095 రైలు 8న సాయంత్రం 7.35కి విజయవాడ చేరుకుని 10న ఉదయం 10 గంటలకు గయ చేరుకుంటుందని, 10న నం.07096 రైలు మధ్యాహ్నం 2.15కి బయలుదేరి 12న సాయంత్రం 4కి విజయవాడ చేరుకుంటుందని తెలిపింది.
Similar News
News November 22, 2025
రాజాంలో ప్రేమజంట ఆత్మహత్యయత్నం

రాజాం మండలం బొద్దాం సమీప తోటలో శుక్రవారం ప్రేమజంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గరివిడి మండలం దుగ్గివలసకి చెందిన చెందిన అమ్మాయి, రాజాం వస్త్రపురి కాలనీకి చెందిన అబ్బాయి పెద్దలు పెళ్లికి ఒప్పుకోరన్న భయంతో హానికారక మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. అనంతరం రాజాం ప్రభుత్వ ఆసుపత్రికి వైద్యం కోసం వచ్చారు. వైద్యులు ఇరువురిని మెరుగైన చికిత్స కోసం శ్రీకాకుళం ప్రభుత్వ ఆసుపత్రికి రిఫర్ చేశారు.
News November 22, 2025
పల్నాడు: కన్నమదాసు మేడ గురించి తెలుసా..?

పల్నాడు సర్వ సైన్యాధిపతి మాల కన్నమ దాసు మేడ కారంపూడి నడి బొడ్డున నేటికీ ఉంది. బ్రహ్మనాయుడు మాల కన్నమ దాసుని దత్తపుత్రుడుగా స్వీకరించి పల్నాడు రాజ్యానికి సర్వ సైన్యాధ్యక్షుడిగా చేశారు. అయితే కులం కారణంగా కన్నమదాసుతో కారంపూడి రణక్షేత్రంలో యుద్ధం చేయడానికి ప్రత్యర్థులు నిరాకరించారు. కన్నమదాసు నాగులేరు ఒడ్డున మేడ నిర్మించుకొని అక్కడ నుంచే యుద్ధ పర్యవేక్షణ చేసినట్లు ప్రతీతి.
News November 22, 2025
సిరిసిల్ల CESS కార్యాలయంలో గదుల మార్పునకు సన్నాహాలు..!

సిరిసిల్ల సెస్ కార్యాలయంలో వాస్తు సరిగ్గా లేదంటూ పూజలు నిర్వహించడం సర్వత్రా విమర్శలకు దారితీసింది. హంపీ పీఠాధిపతి శ్రీ విద్యారణ్య భారతి స్వామి ఆధ్వర్యంలో శుక్రవారం ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. అయితే గత కొంతకాలంగా పాలకవర్గం పనితీరుపై వరుసగా విమర్శలు వస్తున్నాయి. కాగా, స్వామీజీ సూచనల మేరకు వాస్తు సరిగ్గా లేని గదుల్లో మార్పులకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.


