News February 17, 2025
కుంభమేళాలో అనకాపల్లి ఎంపీ

అనకాపల్లి ఎంపీ, రైల్వే స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ సీఎం రమేశ్ కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాగ్రాజ్ వెళ్లారు. మహా కుంభమేళాలో పాల్గొని త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించారు. మహావిష్ణు, పరమేశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎంపీ మాట్లాడుతూ.. కుంభమేళాలో పుణ్య స్నానాలు ఆచరించడం అదృష్టంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు.
Similar News
News October 25, 2025
సిద్దిపేట: రెండు రోజులు గ్రామాలకు పోలీసులు

పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాల్లో భాగంగా ఈ నెల 27, 28న రెండు రోజుల పాటు సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉన్న గ్రామాల్లో పోలీస్ అధికారులు, సిబ్బంది గ్రామాలను సందర్శిస్తారని సీపీ విజయ్ కుమార్ తెలిపారు. గ్రామాల్లోని సమస్యల గురించి తెలియపరచాలని, పరిష్కరించగలిగే సమస్యలు ఉంటే అక్కడికక్కడే పరిష్కరిస్తారన్నారు. ఇతర శాఖలకు సంబంధించిన సమస్యలు ఉంటే సంబంధిత శాఖకు నివేదిస్తామన్నారు.
News October 25, 2025
దశల వారీగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పూర్తి చేస్తాం: కలెక్టర్

దశల వారీగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పూర్తి చేస్తామని జనగామ కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా తెలిపారు. శనివారం హైదరాబాద్ నుంచి చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ సుదర్శన్ రెడ్డి, అదనపు ముఖ్య ఎన్నికల అధికారి లోకేష్ కుమార్, సంబంధిత శాఖల అధికారులతో కలిసి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్పై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. స్థానిక కలెక్టరేట్ నుంచి కలెక్టర్తో పాటు అదనపు కలెక్టర్ బెన్ షాలోమ్, ఆర్డీవోలు పాల్గొన్నారు.
News October 25, 2025
ANU: దూరవిద్య పీజీ పరీక్ష ఫలితాలు విడుదల

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం దూరవిద్య కేంద్రం పరిధిలో జులై, ఆగస్టు మాసాలలో జరిగిన పలు పీజీ కోర్సుల పరీక్ష ఫలితాలను దూరవిద్య కేంద్రం డైరెక్టర్ వంకాయలపాటి వెంకటేశ్వర్లు శనివారం విడుదల చేశారు. ఎంఏ, ఎంకామ్, ఎంహెచ్ఆర్ 1 – 4 సెమిస్టర్లు, ఎంఏ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ మొదటి, ద్వితీయ, నాలుగో సెమిస్టర్లు, మాస్టర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ మొదటి, ద్వితీయ సెమిస్టర్ పరీక్ష ఫలితాలను విడుదల చేశారు.


