News February 9, 2025
కుంభాభిషేకం విజయవంతం పట్ల హర్షం వ్యక్తం చేసిన BHPL కలెక్టర్

కాళేశ్వర దేవస్థానంలో మూడు రోజులపాటు ఘనంగా నిర్వహించిన మహా కుంభాభిషేక కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించడం పట్ల జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ హర్షం వ్యక్తం చేశారు. ఈ మహోత్సవాల్లో భాగస్వాములైన అన్ని శాఖల జిల్లా అధికారులను, సిబ్బందిని, మహోత్సవానికి విస్తృత ప్రచారం కల్పించిన పాత్రికేయులకు, జిల్లా యంత్రాంగం సలహాలు, సూచనలు పాటిస్తూ సహకరించిన భక్తులకు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అభినందించారు.
Similar News
News March 21, 2025
LRS ప్రక్రియపై నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్న జనగామ కలెక్టర్

పురపాలక ముఖ్య కార్యదర్శి దాన కోషోర్ అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫెరెన్స్ నిర్వహించి LRS ప్రక్రియపై పలు సూచనలు ఇచ్చారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ పాల్గొన్నారు. ఎల్ఆర్ఎస్ క్రమబద్ధీకరణను ఉపయోగించుకునేలా అవగాహన కల్పించాలని, దరఖాస్తుదారులందరికి ఫోన్ కాల్ చేసి రాయితీని వినియోగించుకునేలా సిబ్బంది ప్రోత్సహించాలన్నారు.
News March 21, 2025
ఏలూరు: ఆరేళ్ల తర్వాత సంచలన తీర్పు

కామవరపుకోట(M) గుంటుపల్లి బౌద్ధాలయాల వద్ద 2019లో ప్రేమజంటపై దాడి జరిగింది. ఈక్రమంలో యువతిని హత్య చేశారు. కృష్ణా(D) జి.కొండూరుకు చెందిన రాజు(28), ద్వారకాతిరుమల(M) జి.కొత్తపల్లికి చెందిన సోమయ్య(22), గంగయ్య(20), నందివాడ(M) అరిశెల గ్రామానికి చెందిన నాగరాజును నిందితులుగా గుర్తించారు. వీరికి జీవిత ఖైదు విధిస్తూ పోక్సో కోర్టు జడ్జి సుమా సునంద శిక్ష విధించారని ఏలూరు SP ప్రతాప్ శివకిషోర్ వెల్లడించారు.
News March 21, 2025
ఆరు గ్యారంటీలకు రూ.56 వేల కోట్ల ఖర్చు: భట్టి

TG: BRS హయాంలో GST వృద్ధి రేటు 8.54 ఉంటే తమ హయాంలో 12.3 శాతంగా ఉందని Dy.CM భట్టి విక్రమార్క తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రూ.2.80 లక్షల కోట్లు ఖర్చు చేశామని అసెంబ్లీలో చెప్పారు. ‘ఆరు గ్యారంటీలకే రూ.56 వేల కోట్లు ఖర్చు పెడతాం. బడ్జెట్ను కుదించి వాస్తవ లెక్కలు చెప్పాం. చేయగలిగినవే మేం బడ్జెట్లో పొందుపరిచాం. పదేళ్లలో రూ.16 లక్షల కోట్లు ఖర్చు చేసి BRS ఏం సాధించింది?’ అని పేర్కొన్నారు.