News January 30, 2025
కుక్కునూరు: జామాయిల్ తోటలో అస్థిపంజరం లభ్యం

కుక్కునూరు గ్రామ శివారులోని రైస్ మిల్ వెనక జామాయిల్ తోటలో అస్థిపంజరం లభ్యమైంది. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఘటనా స్థలంలో దొరికిన వస్తువుల ఆధారంగా మృతుడు తెలంగాణలోని చర్ల ప్రాంతానికి చెందిన ఐత రమేశ్ (42)గా పోలీసులు గుర్తించారు. గత కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతుండగా.. చికిత్స చేయించుకున్నా వ్యాధి తగ్గకపోవడంతో జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్యకు చేసుకున్నట్లు భావిస్తున్నారు.
Similar News
News February 28, 2026
3,979 పోస్టులు.. దరఖాస్తుకు 3రోజులే ఛాన్స్

యంత్ర ఇండియా లిమిటెడ్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలలో 3,979 ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులకు అప్లై చేయడానికి ఇంకా 3 రోజులే(మార్చి 3) సమయం ఉంది. ITI, టెన్త్ అర్హత గలవారు అప్లై చేసుకోవచ్చు. మెరిట్, DV, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. టెన్త్ అభ్యర్థులకు నెలకు రూ.8200, ITI అభ్యర్థులకు రూ.9600 స్టైపెండ్ చెల్లిస్తారు. దరఖాస్తు ఫీజు రూ.200+GST, SC, ST, మహిళలకు రూ.100+GST. వెబ్సైట్: recruit-gov.com/
News February 28, 2026
నల్లగొండ: 28న జిల్లావ్యాప్తంగా జాతీయ లోక్ అదాలత్

జిల్లాలోని అన్ని కోర్టు సముదాయాల్లో ఈ నెల 28న జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నారు. రాజీపడదగ్గ క్రిమినల్, చెక్ బౌన్స్, కుటుంబ వివాదాలు, మోటార్ వాహన ప్రమాదాలు, భూ తగాదాలు వంటి పెండింగ్ కేసులను ఇక్కడ పరిష్కరించుకోవచ్చు. దీనివల్ల కక్షిదారులకు సత్వర న్యాయంతో పాటు సమయం, ఖర్చు ఆదా అవుతాయని జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఛైర్మన్ తెలిపారు. అప్పీలుకు తావులేని ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
News February 28, 2026
NGKL: ఇంటర్ పరీక్షలు.. 159 మంది గైర్హాజరు

నాగర్ కర్నూల్ జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలు శనివారం ప్రశాంతంగా జరిగినట్లు నోడల్ అధికారి వెంకట్ రమణ తెలిపారు. జిల్లాలో మొత్తం 5,921 మంది విద్యార్థులకు గాను 5,763 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరైనట్లు తెలిపారు. 159 మంది విద్యార్థులు పరీక్షలకు గైర్హాజరైనట్లు పేర్కొన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేపట్టినట్లు తెలిపారు.


