News February 3, 2025
కుక్కునూరు: రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

బైక్ ను ట్రాక్టర్ ఢీకొన్న ఘటనలో ఒక వ్యక్తి మృతి చెందగా మరో వ్యక్తి గాయపడిన కుక్కునూరు మండలం నెమలి పేట గ్రామంలో జరిగింది. అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండలం చింతలగూడెం గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు బైక్ పై వేలేరుపాడు వెళ్తుండగా ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ ఢీ కొనడంతో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. వీరిని అంబులెన్స్లో ఆసుపత్రికి తరలిస్తుండగా ఐతంరాజుల శ్రీనివాస్ మృతి చెందాడు.
Similar News
News January 25, 2026
2028లో స్పేస్ స్టేషన్ పనులు ప్రారంభం: ISRO

ఇండియన్ స్పేస్ స్టేషన్ పనులు 2028లో ప్రారంభమవుతాయని ISRO ఛైర్మన్ డా.వి.నారాయణన్ వెల్లడించారు. 2035 నాటికి పూర్తవుతాయని తెలిపారు. ఇటీవల ఫెయిలైన PSLV-C62 మిషన్ ప్రభావం ‘గగన్యాన్’ (మానవ సహిత అంతరిక్ష యాత్ర) ప్రాజెక్టుపై ఉండదని స్పష్టం చేశారు. చంద్రుని సౌత్ పోల్పై స్పేస్క్రాఫ్ట్ను విజయవంతంగా ల్యాండ్ చేసిన ఘనత మనదేనని గుర్తుచేశారు. కాగా గగన్యాన్ మిషన్ను 2026 చివర్లో/2027లో ప్రయోగించే అవకాశముంది.
News January 25, 2026
WGL: ఆశావహుల నుంచి కాంగ్రెస్ దరఖాస్తుల స్వీకరణ!

మున్సిపల్ ఎన్నికల్లో బరిలో నిలిచే అభ్యర్థుల నుంచి కాంగ్రెస్ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ఆదేశాల ప్రకారం మున్సిపాలిటీల్లో వార్డు సభ్యులుగా పోటీ చేసేందుకు ఆసక్తి ఉన్న నాయకులు, కార్యకర్తలు ఆదివారం నుంచి దరఖాస్తు చేసుకోవాలని ఆదేశించారు.ఎలాంటి రుసుం లేకుండా ఉచితంగా దరఖాస్తుల స్వీకరించనున్నారు. నేటి నుంచి కాంగ్రెస్ అభ్యర్థులు పార్టీ పెద్దల వద్దకు పరుగులు తీయనున్నారు.
News January 25, 2026
GNT: పెళ్లి పేరుతో ఘరనా మోసం.. రూ.5 లక్షలతో వధువు పరార్!

తాడేపల్లి మండలం పెనుమాకలో పెళ్లి పేరుతో మోసం వెలుగుచూసింది. శ్యామల అనే హిజ్రా, విజయలక్ష్మీ అనే మహిళను నల్గొండకు చెందిన దివ్యాంగుడు సందీప్ రెడ్డికిచ్చి వివాహం జరిపించారు. కొన్నాళ్లకే తల్లికి బాగోలేదని చెప్పి, రూ. 5 లక్షల నగదు, బంగారంతో వధువు, శ్యామల కలిసి ఉడాయించారు. ఆరా తీయగా ఆమెకు ముందే పెళ్లయిందని తేలింది. బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. శ్యామల గతంలోనూ ఇలాంటి మోసాలు చేసినట్లు సమాచారం.


