News August 12, 2024
కుటుంబ కలహాలతో భర్త SUICIDE

కుటుంబ కలహాలతో భర్త ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన నిడదవోలు మండలం గోపవరంలో ఆదివారం చోటుచేసుకుంది. ఎస్సై రమేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. గోపవరానికి చెందిన మారిశెట్టి మహేశ్వరరావు(30) కుటుంబ కలహాల కారణంగా పురుగుల మందు తాగాడు. చికిత్స నిమిత్తం అతడిని రాజమండ్రి ఆసుపత్రికి తరలించగా, అక్కడ మృతి చెందాడు. కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.
Similar News
News December 7, 2025
ప.గో: YCPకి జిల్లా కీలక నేత రాజీనామా..!

తాడేపల్లిగూడెంకు చెందిన వైసీపీ జిల్లా మాజీ ఉపాధ్యక్షుడు తెన్నేటి జగ్జీవన్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు పార్టీ జిల్లా అధ్యక్షుడికి రాజీనామా లేఖ పంపినట్లు జగ్జీవన్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇటీవల కాలంలో వైసీపీలో నెలకొన్న పరిణామాలు, పార్టీ విధానాలు, గుర్తింపు లేకపోవడం వంటి కారణాలతో పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు పేర్కొన్నారు. రాజకీయ భవిష్యత్తుపై త్వరలో ఓ నిర్ణయాన్ని ప్రకటిస్తానన్నారు.
News December 7, 2025
ప.గో డిగ్రీ విద్యార్థులకు గమనిక

ఆదికవి నన్నయ యూనివర్సిటీ మూడు క్యాంపస్లో పీజీ కోర్సులకు ఈ నెల 8-12 వరకు స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు ఉపకులపతి ఎస్. ప్రసన్నశ్రీ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. రాజమహేంద్రవరం, కాకినాడ, తాడేపల్లిగూడెం క్యాంపస్లలోని MA, M.com,Mped,Msc కోర్సులకు రాజమహేంద్రవరంలో ఉదయం10-4 గంటల వరకు స్పాట్ అడ్మిషన్లు జరుగుతాయన్నారు. మరిన్ని వివరాలకు యూనివర్సిటీ వెబ్సైట్ను సంప్రదించాలన్నారు.
News December 6, 2025
భీమవరం: మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలి- కలెక్టర్

ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపనలో SHG మహిళలు అవగాహన కలిగి, యూనిట్ల స్థాపన ద్వారా ఆర్థికంగా అభివృద్ధి చెందాలని కలెక్టర్ నాగరాణి అన్నారు. శనివారం కలెక్టరేట్లో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఇప్పటికే స్థాపించిన యూనిట్లకు ఆధునిక సాంకేతికతను జోడించి వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడానికి, ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార శుద్ధి పరిశ్రమ క్రమబద్దీకరణ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.


