News April 7, 2025
కుటుంబ సభ్యులపై నీచపు రాజకీయాలా?: తోపుదుర్తి

బంధువుల అమ్మాయితో తాను ఎయిర్పోర్టులో మాట్లాడుతున్న వీడియోను వైరల్ చేస్తూ టీడీపీ శ్రేణులు దుష్ప్రచారం చేస్తున్నాయని మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి మండిపడ్డారు. ‘రేపు జగన్ పాపిరెడ్డిపల్లెకు వస్తున్నారు. ఆ పర్యటనను అడ్డుకునే పరిస్థితి కనపడకపోవడంతో నా బంధువులు, కుటుంబసభ్యులను నీచపు రాజకీయ క్రీడలోకి లాగుతున్నారు. ఆ వీడియోను వైరల్ చేస్తున్న వారిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తా’ అని ట్వీట్ చేశారు.
Similar News
News October 21, 2025
కార్తీక మాసం.. పార్వతీపురం మన్యం జిల్లాలో శైవక్షేత్రాలు సిద్ధం..!

రేపటి నుంచి కార్తీక మాసం ప్రారంభం కానున్న నేపథ్యంలో పార్వతీపురం మన్యం జిల్లాలోని శైవక్షేత్రాలిల్లో ఏర్పాట్లు చేస్తున్నారు.
➤ అడ్డాపుశీలలో శ్రీకాశీవిశ్వేశ్వరస్వామి
➤ గుంప వద్ద నాగావళి, జంఝావతి నదుల సంగమంలో సోమేశ్వరాలయం
➤ సాలూరులో పంచముఖేశ్వరాలయం
➤ ములక్కాయవలసలో విశ్వేశ్వరాలయం
➤ గుమ్మలో నీలకంటేశ్వర ఆలయం
➤ కురుపాంలో ధూళికేశ్వరాలయం
ఇవి కాకుండా మీకు తెలిసిన శైవక్షేత్రాలను కామెంట్ చెయ్యండి.
News October 21, 2025
సిరిసిల్ల: ‘పోలీసుల త్యాగాలు స్ఫూర్తిదాయకం’

విధి నిర్వహణలో అమరులైన పోలీసుల త్యాగాలు మనకు స్ఫూర్తిదాయకమని బెటాలియన్ కమాండెంట్ సురేష్ అన్నారు. సిరిసిల్ల పరిధిలోని సర్దాపూర్ బెటాలియన్లో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా అమరులైన పోలీసులకు వారు నివాళులు అర్పించారు. అనంతరం సురేష్ మాట్లాడుతూ.. సమాజంలో శాంతిభద్రతలను కాపాడుతూ.. అవసరమైతే ప్రాణత్యాగం చేయడానికి కూడా పోలీసులు వెనకాడరని కొనియాడారు. వారి త్యాగాలు ఎన్నటికీ మరువలేనివి అన్నారు.
News October 21, 2025
చిత్తూరు: ఇకనైనా మైనింగ్ మాఫియాకి చెక్ పడేనా..?

చిత్తూరులో కొంత కాలంగా రాయల్టీ పైకానికి బ్రేక్ పడింది. రాఘవ కన్స్ట్రక్షన్ కంపెనీ టెండర్ గత నెలాఖరుతో ముగిసింది. నేరుగా మైనింగ్ అధికారుల పర్యవేక్షణలో గ్రానైట్, గ్రావెల్ తరలింపు కొనసాగుతోంది. నూతన టెండర్ ఖరారుపై రాష్ట్ర ప్రభుత్వం ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. మరో 3 నెలలు రాఘవ కన్స్ట్రక్షన్ కంపెనీకి పొడిగిస్తారా..? లేక నూతన టెండర్ ఖరారు చేస్తారా? అనే అంశం మరి కొన్నిరోజుల్లో తేలనుంది.