News March 2, 2025
కుప్పం టౌన్ బ్యాంక్ పై రిజర్వ్ బ్యాంక్ ఆంక్షలు ఎత్తివేత

కుప్పం కో-ఆపరేటివ్ టౌన్ బ్యాంక్ పై రిజర్వ్ బ్యాంక్ పెట్టిన ఆంక్షలు ఎత్తివేసినట్లు పీఐసీ ఛైర్మన్ బ్రహ్మానందరెడ్డి, బ్యాంకు మేనేజర్ శివకృష్ణ పేర్కొన్నారు. ఇకపై బ్యాంకులో మోర్టగేజ్, గోల్డ్, హౌసింగ్ లోన్స్ మంజూరు చేయడం జరుగుతుందన్నారు. మార్చి తర్వాత షేర్ హోల్డర్లకు చెల్లించాల్సిన డిపెండెంట్లు సైతం చెల్లిస్తామని, బ్యాంకు పరిధిలో పేరుకుపోయిన సుమారు రూ.3 కోట్ల బకాయిలను రికవరీ చేసినట్లు వారు తెలిపారు.
Similar News
News July 6, 2025
చిత్తూరు: జాతీయ లోక్ అదాలత్లో 203 కేసుల పరిష్కారం

పలమనేరు కోర్టు ఆవరణలో శనివారం జరిగిన జాతీయ లోక్ అదాలత్లో 203 కేసులు పరిష్కారమైనట్లు సీనియర్ సివిల్ జడ్జి ఆదినారాయణ తెలిపారు. సివిల్, క్రిమినల్, బ్యాంకు తదితర కేసులను పరిష్కరించినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జూనియర్ సివిల్ జడ్జి లిఖిత, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎల్.భాస్కర్, న్యాయవాదులు, పోలీసులు పాల్గొన్నారు.
News July 5, 2025
చిత్తూరు: బాలికపై అత్యాచారం.. 20 ఏళ్ల జైలు శిక్ష

2020 జులై 20వ తేదీన మైనర్ బాలికపై రామకృష్ణ(47) అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ కేసులో నిందితుడికి 2025 జులై 4వ తేదీ శుక్రవారం చిత్తూరు జిల్లా ప్రత్యేక పోక్సో కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష, రూ.5 వేలు జరిమానా విధించింది. ముద్దాయికి శిక్ష పడేలా కృషి చేసిన దిశ డీఎస్పీ బాబు ప్రసాద్, పలమనేరు డీఎస్పీ డేగల ప్రభాకర్, చౌడేపల్లి సీఐ భూపాల్, ఎస్సై శివశంకర్లను జడ్జ్ అభినందించారు.
News July 5, 2025
చిత్తూరు: బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం

పోలీసు శాఖలో మృతి చెందిన బాధిత కుటుంబాలకు ఎస్పీ మణికంఠ శుక్రవారం ఆర్థిక సాయం అందజేశారు. ఎస్ ఆర్ పురం పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తూ మృతి చెందిన కానిస్టేబుల్ ఆనంద్ బాబు సతీమణి మాధవి, గుడిపల్లి స్టేషన్లో మృతి చెందిన లక్ష్మీ భర్త ఆనంద్కు ఒక్కొక్కరికి లక్ష రూపాయల చొప్పున చెక్కులను ఆయన అందజేశారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని హమీ ఇచ్చారు.