News July 22, 2024
కుప్పం పోలీసుల అదుపులో నాగార్జున యాదవ్

సీఎం చంద్రబాబు పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ను కుప్పం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నాగార్జున యాదవ్పై టీడీపీ నేతలు ఫిర్యాదుతో కుప్పం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయింది. ఈ నేపథ్యంలో చిత్తూరు జిల్లా పలమనేరు సమీపంలోని ఓ హోటల్ వద్ద రాత్రి నాగార్జున యాదవును కుప్పం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నాగార్జున యాదవ్ను కాసేపట్లో పోలీసులు కోర్టులో హాజరు పర్చనున్నారు.
Similar News
News January 3, 2026
మూడు రోజుల్లో రూ.9.76 కోట్ల మద్యం తాగేశారు.!

చిత్తూరు జిల్లాలో నూతన సంవత్సర వేడుకల సందర్భంగా మూడు రోజుల్లో రూ.9.76 కోట్ల విలువైన మద్యాన్ని మందు బాబులు తాగేశారు. నూతన సంవత్సరం వేడుకల్లో జిల్లాలో మద్యం ఏరులై పారింది. డిసెంబరు 30, 31 తేదీలతో పాటు జనవరి ఒకటిన మద్యం అమ్మకాలు భారీగా పెరిగాయి. ఈ మూడ్రోజుల్లో రూ.9.76 కోట్ల విలువైన.. 5738 కేసుల బీర్లు, ఇండియన్ మేడ్ లిక్కర్ (IML) 14,130 కేసులు అమ్ముడయ్యాయి.
News January 3, 2026
చిత్తూరు: KGBVల్లో 25 పోస్టులకు దరఖాస్తులు.!

చిత్తూరు జిల్లాలోని KGBVల్లో 25 ఖాళీలకు నోటిఫికేషన్ వచ్చింది. కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్-4, ANM-6, హెడ్ కుక్-1, ASST కుక్-4 ఖాళీలు ఉండగా టైప్-4లో వార్డెన్-2, పార్ట్ టైమ్ టీచర్-3, చౌకిదార్-2, హెడ్ కుక్-1 ASST కుక్-2 ఉన్నాయి. మహిళలకు మాత్రమే అవకాశం. అప్లికేషన్లు జిల్లా కేంద్రంలోని సమగ్ర శిక్ష కార్యాలయంలో అందజేయాల్సి ఉంటుంది.
News January 3, 2026
తిరుపతిలో రేపు చిరంజీవి మూవీ ట్రైలర్ లాంచ్

హీరో చిరంజీవి నటించిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా ట్రైలర్ లాంచ్ ఆదివారం తిరుపతిలోని SV సినీప్లెక్స్లో జరగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు ఈ కార్యక్రమం ఉండనుంది. ఈ ఈవెంట్లో డైరెక్టర్ అనిల్ రావిపూడి, నిర్మాత సాహు గరికిపాటి, సుస్మిత కొణిదెల, హాస్యనటుడు శ్రీనివాస్ రెడ్డితో పాటు ఇతర చిత్ర బృంద సభ్యులు పాల్గొననున్నారు.


