News July 22, 2024

కుప్పం పోలీసుల అదుపులో నాగార్జున యాదవ్

image

సీఎం చంద్రబాబు పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్‌ను కుప్పం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నాగార్జున యాదవ్‌పై టీడీపీ నేతలు ఫిర్యాదుతో కుప్పం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయింది. ఈ నేపథ్యంలో చిత్తూరు జిల్లా పలమనేరు సమీపంలోని ఓ హోటల్ వద్ద రాత్రి నాగార్జున యాదవును కుప్పం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నాగార్జున యాదవ్‌ను కాసేపట్లో పోలీసులు కోర్టులో హాజరు పర్చనున్నారు.

Similar News

News July 11, 2025

త్వరలోనే TDP ఉనికి గల్లంతు: పెద్దిరెడ్డి

image

వచ్చే ఎన్నికల్లో YCP విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరని MLA పెద్దిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. గురువారం ఆయన ఎర్రాతివారిపల్లెలో ‘బాబు షూరిటీ-మోసం గ్యారెంటీ’ కార్యక్రమంలో పాల్గొన్నారు. తన జీవితంలో మామిడిని రూ.2కే కొనడం ఎప్పుడూ చూడలేదన్నారు. కర్ణాటక కిలో మామిడిని రూ.16 మద్దతు ధరతో భారీగా అమ్ముతుంటే మన పాలకులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. త్వరలో TDP ఉనికి గల్లంతవ్వడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు.

News July 11, 2025

కుప్పం రైతులకు రూ.25.90 కోట్ల నష్టపరిహారం

image

కుప్పం ఎయిర్పోర్ట్ కోసం 2018లో భూములు ఇచ్చిన రైతులకు వడ్డీతో కలిపి ప్రభుత్వం నష్టపరిహారం మంజూరు చేసింది. పలువురు రైతులకు కడ పీడీ వికాస్ మర్మత్, MLC శ్రీకాంత్, RTC వైస్ ఛైర్మన్ మునిరత్నం, RDO శ్రీనివాసరాజు గురువారం రూ.25.90 కోట్ల చెక్కులను అందజేశారు. మండలాల వారీగా రైతులకు నష్టపరిహారం అందివ్వడం జరుగుతుందని MLC తెలిపారు. భూ సేకరణకు రైతులు సహకరించాలని వారు విజ్ఞప్తి చేశారు.

News July 10, 2025

పూతలపట్టు: గోడ కూలి మహిళ మృతి

image

పూతలపట్టు మండలం బందర్లపల్లి గ్రామంలో కూలి మృతి చెందింది. మూర్తిగాను గ్రామానికి చెందిన మల్లిక అనే మహిళ బందర్లపల్లి గ్రామంలో పని చేస్తూ ఉండగా ఆమెపై గోడ కూలడంతో అక్కడికక్కడే మృతి చెందినట్టు స్థానికులు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం చిత్తూరు ప్రభుత్వ హాస్పిటల్‌కి తరలించినట్లు పేర్కొన్నారు.