News October 17, 2024

కుప్పం : రైలు కిందపడి యువకుడు ఆత్మహత్య

image

బెంగళూరు – చెన్నై రైల్వే మార్గంలోని కుప్పం రైల్వే స్టేషన్ సమీపంలోని గుల్లే పల్లి వద్ద గుడిపల్లి(M) కంచి బందార్లపల్లి చెందిన కిరణ్ (18) ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే పట్టాలపై తలపెట్టి కిరణ్ ఆత్మహత్య చేసుకోవడంతో తలముండెం వేరువేరుగా తెగిపోయింది. కిరణ్ ఆత్మహత్య వ్యవహారంపై కుప్పం రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు.

Similar News

News October 29, 2025

చిత్తూరు: బాలికపై అత్యాచారం.. 20 ఏళ్ల జైలు శిక్ష

image

మైనర్ బాలికను కిడ్నాప్ చేసి, అత్యాచారం చేసిన కేసులో నిందితుడికి చిత్తూరు ప్రత్యేక పోక్సో కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. పోలీసు అధికారుల కథనం మేరకు.. పుంగనూరు మండలంలోని బాలికను 2019 ఏప్రిల్‌లో అత్యాచారం చేసిన కేసులో నేరం నిర్ధారణ కావడంతో కళ్యాణ్ అనే నిందితుడికి జడ్జి శంకర్రావు 20 ఏళ్ల జైలు శిక్ష, రూ.5 వేలు జరిమానా విధించినట్టు తెలిపారు.

News October 29, 2025

కాణిపాకంలో పేలిన సిలిండర్

image

కాణిపాకం కాలనీ హౌసింగ్ విభాగంలో బుధవారం ఉదయం గ్యాస్ సిలిండర్ పేలిన ఘటన సంచలనంగా మారింది. ఈ ఘటనలో చిన్న పాపమ్మకు గాయాలు అయినట్లు సమాచారం. క్షతగాత్రురాలిని తక్షణమే చిత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పేలుడు కారణంగా ఇంటి గోడలు, పైకప్పు భాగం దెబ్బతిన్నట్లు స్థానికులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News October 28, 2025

చిత్తూరు జిల్లాలో స్కూళ్లకు సెలవు లేదు: DEO

image

చిత్తూరు జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు బుధవారం నుంచి యథావిధిగా పనిచేస్తాయని DEO వరలక్ష్మి పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశాల మేరకు జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాలకు మాత్రం సెలవు ప్రకటించడం జరిగిందని, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు యథావిధిగా పనిచేస్తాయని ఆమె తెలిపారు.