News March 22, 2024
కుప్పం: విద్యుత్ షాక్తో యువకుడి మృతి

కుప్పం మండలం బురడ సిద్దనపల్లి గ్రామంలో శుక్రవారం విద్యుత్ షాక్తో యువకుడు మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. మురుగేష్ కుమారుడు రాజశేఖర్ ఇంటర్ మీడియట్ చదువుతున్నాడు. మద్యాహ్నం మేకలకు మేత కోసం వెళ్లినప్పుడు పొలం వద్ద కిందకు వేలాడుతున్న కరెంటు తీగలు పొరపాటున తగిలి రాజశేఖర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Similar News
News December 16, 2025
పుంగనూరు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరి పరిస్థితి విషమం

పుంగనూరు మండలంలోని సుగాలి మిట్ట వద్ద సోమవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల కథనం మేరకు.. ఆగి ఉన్న లారీని మరో మినీ లారీ ఢీకొంది. ఈ ఘటనలో ముగ్గురు గాయపడ్డారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. గాయపడ్డవారు తమిళనాడుకు చెందిన ప్రదీప్, శివ శంకర్, అశోక్గా గుర్తించారు. వారిని ఆసుపత్రికి తరలించారు.
News December 15, 2025
కుప్పంలో CBG ప్లాంట్కు గ్రీన్ సిగ్నల్

క్లీన్ ఎనర్జీ పెట్టుబడులకు ఊతమిస్తూ AP ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ‘ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ–2024’ కింద కుప్పం (M) కృష్ణదాసనపల్లిలో 10 TPD సామర్థ్యంతో కంప్రెస్డ్ బయోగ్యాస్ (CBG) ప్లాంట్ను శ్రేష్ఠా రెన్యూవబుల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ ప్లాంట్ను ఏర్పాటు చేయనుంది. నేపియర్ గడ్డి, సేంద్రీయ వ్యర్థాలతో CBGతో పాటు ఫాస్ఫేట్ రిచ్ ఆర్గానిక్ మెన్యూర్ (PROM) ఉత్పత్తి చేయనున్నారు.
News December 15, 2025
చిత్తూరు: 43 ఫిర్యాదుల స్వీకరణ

చిత్తూరు జిల్లాలో సోమవారం నిర్వహించిన పబ్లిక్ గ్రీవిన్స్ రిడ్రెస్సల్ కార్యక్రమంలో ఎస్పీ తుషార్ డూడి 43 ప్రజా ఫిర్యాదులను స్వీకరించారు. వచ్చిన ప్రతి ఫిర్యాదుపై చట్ట ప్రకారం విచారణ జరిపి, నిర్ణీత గడువులోగా సమస్యలు పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. చీటింగ్–3, కుటుంబ తగాదాలు–5, వేధింపులు–3, భూ తగాదాలు–10, ఇంటి తగాదాలు–5, డబ్బు తగాదాలు–8, ఆస్తి తగాదాలకు సంబంధించిన 9 ఫిర్యాదులు అందాయన్నారు.


