News March 18, 2025

కుబీర్: కరెంట్ షాక్‌తో రైతు మృతి

image

ప్రమాదవశాత్తు కరెంట్ షాక్‌తో రైతు మృతి చెందిన ఘటన కుబీర్ మండలంలో చోటుచేసుకుంది. ఎస్ఐ రవీందర్ వివరాల ప్రకారం సిర్పెల్లి(H) గ్రామానికి చెందిన పబ్బు గణేశ్ (48) సోమవారం వ్యవసాయ భూమిలో మొక్కజొన్నకు నీరు ఇవ్వడానికి వెళ్లాడు. ఇంటికిరాలేదని తన కుమారుడు చేన్లోకి వెళ్లి చూడగా కరెంట్ షాక్‌కు గురై గణేశ్ విగతజీవిగా పడి ఉన్నాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు SI తెలిపారు.

Similar News

News November 24, 2025

జగిత్యాల: ‘మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు’

image

ఇందిరమ్మ చీరల పంపిణీ, వడ్డీ లేని రుణాలపై వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లాల కలెక్టర్లతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమీక్ష సమావేశం నిర్వహించారు. మూడో విడతగా 3,57,098 మహిళా సంఘాలకు రూ.304 కోట్ల రుణాలు విడుదల చేసినట్లు తెలిపారు. రేపు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో భారీగా రుణాల పంపిణీ కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీచేశారు. జగిత్యాల కలెక్టర్ సత్యప్రసాద్, అధికారులు పాల్గొన్నారు.

News November 24, 2025

బీసీలకు రాహుల్ గాంధీ అన్యాయం: కేటీఆర్

image

తెలంగాణ బీసీలకు రాహుల్ గాంధీ చేసిన అన్యాయాన్ని ఢిల్లీలో ఎండగడతామని KTR అన్నారు. ‘ఆయన వెంటనే BC రిజర్వేషన్ల అంశాన్ని పార్లమెంటులో చర్చకు వచ్చేలా చూడాలి. BJP సహకరించకుంటే ప్రైవేట్ మెంబర్ బిల్లు ప్రవేశపెట్టాలి. స్థానిక సంస్థల రిజర్వేషన్ల చుట్టే మొత్తం అంశాన్ని తిప్పుతూ బీసీల విద్య, ఉపాధి, ప్రభుత్వ కాంట్రాక్టుల్లో 42% రిజర్వేషన్ ఇచ్చే అంశాన్ని పక్కనపెట్టారు’ అని కార్యకర్తల సమావేశంలో విమర్శించారు.

News November 24, 2025

జిల్లా పోలీస్ కార్యాలయానికి 62 ఆర్జీలు: SP

image

బాపట్ల పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 62 ఆర్జీలు వచ్చినట్లు SP ఉమామహేశ్వర్ చెప్పారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల వద్ద నేరుగా ఆయన వినతి పత్రాలు స్వీకరించారు. అనంతరం వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బాధితుల సమస్యలు పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి పరిష్కరించి నివేదిక అందజేయాలని సిబ్బందిని ఆదేశించారు.