News February 24, 2025
కుబీర్: రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తి మృతి

రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తి మృతి చెందిన ఘటన కుబీర్ మండలంలో చోటుచేసుకుంది. భైంసా మండలం మిర్జాపూర్ సమీపంలో ఈ నెల 16న రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో కుబీర్కు చెందిన సిందే సంతోష్ తలకు తీవ్రంగా గాయమైంది. కాగా నిజామాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సంతోష్ ఆదివారం మృతి చెందాడని కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Similar News
News November 22, 2025
కంచిలి: “సేవలను సద్వినియోగం చేసుకోవాలి”

కంచిలి మండలం ఎంఎస్ పల్లిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ఆంధ్రప్రదేశ్ ఆదర్శ పాఠశాలలను శనివారం రాష్ట్ర పీఎంశ్రీ పాఠశాలల సీనియర్ లెక్చలర్ పుల్లట రమేష్ సందర్శించారు. పీఎంశ్రీ పాఠశాలల అభివృద్ధికి ప్రభుత్వం ఎన్నో రకాల నిధులు మంజూరు చేస్తుందని పుల్లట రమేష్ అన్నారు. ప్రతి ఒక్కరూ వీటి సేవలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో కంచిలి ఎంఈఓ-2 కుంబి చిట్టిబాబు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.
News November 22, 2025
IIT హైదరాబాద్లో స్టాఫ్ నర్స్ పోస్టులు

<
News November 22, 2025
సీఎంఆర్ సరఫరా వేగవంతం చేయండి: ADB కలెక్టర్

ఆదిలాబాద్ జిల్లాలో కస్టమ్ మిల్లింగ్ రైస్ (CMR) సరఫరాను వేగవంతం చేయాలని కలెక్టర్ రాజార్షి షా మిల్లర్లను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించారు. ఇప్పటికే ప్రభుత్వం విధించిన గడువులు ముగుస్తున్న నేపథ్యంలో మిల్లర్లు సన్నబియ్యం మిల్లింగ్, సిఎంఆర్ సరఫరా పనులను త్వరగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. సమయానికి సిఎంఆర్ సరఫరా చేయని మిల్లర్లపై చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు.


