News August 7, 2024

కురబలకోట: డిగ్రీ విద్యార్థి ఆత్మహత్యాయత్నం

image

ఒంటరి జీవితంపై విరక్తితో డిగ్రీ విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు ముదివేడు మల్లికార్జునరెడ్డి తెలిపారు. కురబలకోట మండలం, తెట్టుకు చెందిన లేట్ మహేశ్వర్ కొడుకు జయకృష్ణ (21) మదనపల్లెలోని ప్రయివేట్ కళాశాలలో డిగ్రీ చదువుతున్నాడు. తండ్రి ఇటీవల అనారోగ్యంతో చనిపోవడం, దానికితోడు ఒంటరిజీవితం గడపడం జీర్ణించుకోలేక నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నంకు పాల్పడ్డాడు. వెంటనే జిల్లా ఆస్పత్రికి తరలించారు.

Similar News

News November 28, 2025

చిత్తూరు: సివిల్స్ ఎగ్జామ్‌కు ఫ్రీ ట్రైనింగ్

image

యూపీపీఎస్సీ సివిల్ సర్వీసెస్‌కు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా బీసీ సంక్షేమ శాఖ డీడీ రబ్బానీబాషా అన్నారు. సివిల్స్ ప్రిలిమనరీ, మెయిన్స్ పరీక్షలకు జిల్లాలో అర్హత ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఉచితంగా శిక్షణ ఇస్తారన్నారు. అభ్యర్థులు ఈ నెల 30వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. వివరాలకు బీసీ సంక్షేమ శాఖ కార్యాలయాన్ని సంప్రదించాలన్నారు.

News November 28, 2025

BLOల నియామకానికి ప్రతిపాదనలు: కలెక్టర్

image

జిల్లా వ్యాప్తంగా ఓటర్ మ్యాపింగ్ ప్రక్రియ పూర్తి చేసినట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ వివరించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో నూతనంగా ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలకు బీఎల్వోల నియామకానికి ప్రతిపాదనలు పంపనున్నట్లు చెప్పారు. బీఎల్ఓలందరికీ గుర్తింపు కార్డులు పంపిణీ చేశామన్నారు.

News November 27, 2025

అధికారులకు కలెక్టర్ కీలక ఆదేశాలు

image

‘రైతన్న మీ కోసం’ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు విధిగా పాల్గొనాలని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ ఆదేశించారు. ఈ మేరకు అధికారులతో ఆయన టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా, డివిజన్, మండల అధికారులు పాల్గొనాలన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో రైతన్న మీకోసం కార్యక్రమంలో భాగంగా సర్వే జరుగుతోందని, ప్రతి ఒక్క అధికారి రైతుల ఇళ్లకు వద్దకు వెళ్లి వివరాలు నమోదు చేయాలని ఆదేశించారు.