News August 7, 2024

కురబలకోట: డిగ్రీ విద్యార్థి ఆత్మహత్యాయత్నం

image

ఒంటరి జీవితంపై విరక్తితో డిగ్రీ విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు ముదివేడు మల్లికార్జునరెడ్డి తెలిపారు. కురబలకోట మండలం, తెట్టుకు చెందిన లేట్ మహేశ్వర్ కొడుకు జయకృష్ణ (21) మదనపల్లెలోని ప్రయివేట్ కళాశాలలో డిగ్రీ చదువుతున్నాడు. తండ్రి ఇటీవల అనారోగ్యంతో చనిపోవడం, దానికితోడు ఒంటరిజీవితం గడపడం జీర్ణించుకోలేక నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నంకు పాల్పడ్డాడు. వెంటనే జిల్లా ఆస్పత్రికి తరలించారు.

Similar News

News December 1, 2025

6న చిత్తూరు జడ్పీ సర్వసభ్య సమావేశం

image

చిత్తూరు జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం ఈనెల 6న నిర్వహించనున్నట్లు ఛైర్మన్ శ్రీనివాసులు, సీఈవో రవికుమార్ నాయుడు ఓ ప్రకటనలో తెలిపారు. ఆ రోజు ఉదయం 10.30 గంటలకు సమావేశం ప్రారంభమవుతుందని చెప్పారు. ఉమ్మడి చిత్తూరులోని ఆయా శాఖల జిల్లా అధికారులు అజెండా నివేదికలను అందజేయాలని సూచించారు.

News December 1, 2025

చిత్తూరు జిల్లాలో తగ్గుతున్న హెచ్ఐవీ కేసులు

image

చిత్తూరు జిల్లాలో హెచ్ఐవీ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. అధికారుల లెక్కల ప్రకారం.. జిల్లాలో 2023-24లో 0.5 శాతం ఉన్న హెచ్ఐవీ వ్యాప్తి.. 2024-25 నాటికి అదే శాతం ఉంది. 2025-26లో 0.36 శాతంగా నమోదైంది. ఈ ఏడాది ఇప్పటి వరకు 47,454 మందిని పరీక్షించగా.. 168 మందికి పాజిటివ్‌గా తేలింది. అలాగే 22,430 మంది గర్భిణులను పరీక్షించగా, వీరిలో 5మందికి హెచ్ఐవీ పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది.

News November 30, 2025

చిత్తూరు: సిబ్బంది అందుబాటులో ఉండాలి

image

తుఫాను నేపథ్యంలో సిబ్బంది అందరూ ప్రధాన కేంద్రాలలో అందుబాటులో ఉండాలని కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. ఆదివారం సాయంత్రం అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించి, ఏర్పాట్లపై దిశా నిర్దేశం చేశారు. 14 మండలాలలో 168 గ్రామాలలో తుఫాను ప్రభావం ఉండే అవకాశం ఉందన్నారు. ఎంపీడీవోలు, తహశీల్దార్లు, సచివాలయ సిబ్బంది అందుబాటులో ఉండి ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు.