News February 26, 2025
కురవిలో జాతర START

కురవిలోని శ్రీ వీరభద్ర స్వామివారి కళ్యాణానికి మంగళవారం అర్చకులు, అంకురార్పణ పూజాకార్యక్రమం నిర్వహించారు. బుధవారం జరిగే స్వామివారి కళ్యాణానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఈవో ఒక ప్రకటనలో తెలిపారు. స్వామివారి కళ్యాణం కాగానే పురవీధుల గుండా, ఊరేగింపు నిర్వహిస్తామని తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరారు.
Similar News
News February 26, 2025
బాపట్లలో గుర్తుతెలియని వ్యక్తి మృతి

బాపట్ల పట్టణంలో భావనారాయణ స్వామి గుడి వద్ద బుధవారం గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. భిక్షాటన చేస్తూ జీవిస్తున్న వ్యక్తి ఉలుకూ పలుకూ లేకుండా పడి ఉండడాన్ని స్థానికులు గుర్తించారు. వెంటనే 108కు సమాచారం అందించగా, వారు పరిశీలించి మృతి చెందినట్లు ధ్రువీకరించారన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News February 26, 2025
జగిత్యాల: ఎమ్మెల్సీ ఎన్నికల డిస్ట్రిబ్యూషన్ సెంటర్ను పరిశీలించిన కలెక్టర్

జగిత్యాల పట్టణంలోని వివేకానంద మినీ స్టేడియంలో ఏర్పాటుచేసిన ఎమ్మెల్సీ ఎన్నికలు డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ సెంటర్ను, ఏర్పాట్లను కలెక్టర్ సత్యప్రసాద్ బుధవారం పరిశీలించారు. రూట్ బస్సులను పరిశీలించారు. ఎన్నికల ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. ఆయన వెంట ఎస్పీ అశోక్ కుమార్, ఆర్డీవోలు తదితర అధికారులు ఉన్నారు.
News February 26, 2025
ఎగ్జామ్ టైమ్ అంటే లవర్స్ లేచిపోయే వేళ!

బిహార్లో బోర్డ్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. దీంతో పేరెంట్స్ గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఎందుకంటారా! ఇది లేచిపోయే టైమ్ కాబట్టి! ఇక్కడి పరీక్షల్లో పాసవ్వడం ఈజీ కాదు. పాసవ్వకుంటే అమ్మాయిలకు తల్లిదండ్రులు పెళ్లిచేసేస్తుంటారు. అందుకే ఎగ్జామ్పై డౌటుంటే ఎవర్నో చేసుకొనే బదులు తమ లవర్స్తో నుదుటున బొట్టు పెట్టించుకొని లేచిపోతారు. రీసెంటుగా ఓ యువతికి అబ్బాయి పాపిట సింధూరం పెట్టడం వైరల్గా మారింది.