News February 26, 2025
కురవిలో జాతర START

కురవిలోని శ్రీ వీరభద్ర స్వామివారి కళ్యాణానికి మంగళవారం అర్చకులు, అంకురార్పణ పూజాకార్యక్రమం నిర్వహించారు. బుధవారం జరిగే స్వామివారి కళ్యాణానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఈవో ఒక ప్రకటనలో తెలిపారు. స్వామివారి కళ్యాణం కాగానే పురవీధుల గుండా, ఊరేగింపు నిర్వహిస్తామని తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరారు.
Similar News
News October 14, 2025
E20 వాడకంతో ఆ కార్లలో మైలేజ్ డ్రాప్: సర్వే

20శాతం <<17378231>>ఇథనాల్<<>> కలిపిన పెట్రోల్ను వాడుతున్న కార్లలో మైలేజ్ తగ్గుతుందని ఓ సర్వేలో తేలింది. మొత్తం 36వేల మంది ఈ సర్వేలో పాల్గొనగా 2022 అంతకుముందు కొన్న కార్లలో ప్రతి 10లో ఎనిమిదింటిలో ఈ ప్రాబ్లమ్ ఉందని పేర్కొంది. ఆగస్టులో ఈ సమస్య 67శాతంగా ఉండగా ప్రస్తుతం 80శాతానికి పెరిగిందని వివరించింది. అంతేకాకుండా 52% వాహనాదారులు ఇంజిన్, ట్యాంక్ ఇతర సమస్యలు ఎదుర్కొంటున్నారని వెల్లడించింది.
News October 14, 2025
సత్యసాయి శతజయంతి వేడుకలకు ఉపరాష్ట్రపతికి ఆహ్వానం

పుట్టపర్తిలో సత్యసాయి బాబా శతజయంతి ఉత్సవాలు నవంబర్ 23 నుంచి ఘనంగా జరగనున్నాయి. సత్యసాయి మేనేజింగ్ ట్రస్టీ ఆర్జే రత్నాకర్ ఢిల్లీలో ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ను మర్యాదపూర్వకంగా కలిసి సత్యసాయి శతజయంతి ఉత్సవాలకు ఆహ్వానించారు. ఈ సందర్భంగా బాబా చిత్రపటాన్ని బహూకరించారు. అనంతరం సత్యసాయి సేవా కార్యక్రమాలను ఉపరాష్ట్రపతి ప్రసంశించినట్లు రత్నాకర్ తెలిపారు.
News October 14, 2025
సమాన వేతన హక్కు గురించి తెలుసా?

స్త్రీ, పురుషులెవరైనా ఒకే రకం పని చేస్తున్నప్పుడు పొందాల్సిన జీతభత్యాలూ ఇద్దరికీ ఒకేవిధంగా ఉండాలని సమాన వేతన చట్టం-1976 చెబుతోంది. పేమెంట్లో వ్యత్యాసం చూపడం చట్టవిరుద్ధం. హైరింగ్, ప్రమోషన్, ట్రైనింగ్లో మహిళలపై వివక్షతను తొలగించడానికి ఈ రూల్ తీసుకొచ్చారు. ఒక మహిళ తక్కువ వేతనం అందుతున్నట్లు భావిస్తే, ఆమె ప్రైవేట్/ ప్రభుత్వ రంగం.. ఎందులో పనిచేస్తున్నా చట్టబద్ధంగా సవాలు చేయవచ్చు. <<-se>>#womenlaws<<>>